19-06-2025 12:27:14 AM
భద్రాచలం జాన్18, (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఈనెల ఏడవ తేదీన ఏ ఎస్ ఆర్ కాలనీలో జరిగిన కనితి సతీష్ హత్య కేసులో నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు భద్రాచలం ఏ ఎస్ పి శ్రీ విక్రాంత్ కుమార్ సింగ్ తెలిపారు.
హత్య కేసులో ప్రధాన నిందితుడైన కుంజా సాయిరామును ఈనెల 9వ తేదీన అరెస్టు చేశామని, అతనికి సహకరించిన ఆరుగురు నిందితులు పరారీలో ఉండగా గాలింపు చర్యలు చేపట్టడంతో బుధవారం వారిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. మురాల ప్రదీప్, కొండవీటి పవన్ కళ్యాణ్, దామర్ల రమేష్, షేక్ షరీఫ్, పగిడి పాటే మురళీకృష్ణ, వల్లెపు నాణీలను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఆయన తెలిపారు.