21-06-2025 08:40:34 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల కేంద్రంలో నాలుగు రోజుల క్రితం ఆస్తి తగాదాల నేపథ్యంలో అన్నను కత్తితో పొడిచి చంపిన ఘటనలో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ కృష్ణ కిషోర్(DSP Krishna Kishore) తెలిపారు. ఈ సంఘటనలో మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని డీఎస్పీ తెలిపారు. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా చోటుచేసుకుని, అన్నను హత్య చేస్తే ఆస్తి తాము దక్కించుకోవచ్చని పక్క ప్లాన్ ప్రకారం అన్న వల్లెపు కృష్ణను తమ్ముళ్లు మరికొందరితో కలిసి హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు. హత్యకు వినియోగించిన కత్తి, మోటార్ సైకిల్, స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో మరిపెడ సిఐ రాజకుమార్, సీరోల్ ఎస్సై నగేష్ పాల్గొన్నారు.