07-09-2025 07:13:27 PM
తెలియని వారితో పరిచయాలు పెంచుకోవద్దు..
తొర్రూరు డిఎస్పి కృష్ణ కిషోర్..
మరిపెడ (విజయక్రాంతి): మహబూబాద్ జిల్లా ఈనెల ఒకటో తారీకు రాత్రి పురుషోత్తమయగూడెం గ్రామ శివారులో జరిగిన బంటు వెంకటమ్మ హత్య కేసులో నిందితుడిని సాగాల వీరన్నను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్(DSP Krishna Kishore) ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఉల్లేపల్లి గ్రామానికి చెందిన బంటు వెంకటమ్మ(55) సంవత్సరాలు గౌడ ఈమె రోజువారి కూలీలను పోగు చేసి ఎక్కడ పని ఉంటె అక్కడ కులి పనులు చేపిస్తూ ఉంటుంది. ఈమెకి చాలామంది కూలీలు పరిచయం, ఈమె చుట్టుపక్కల ఉన్న ఊర్లలో కూడా కూలి పనులు చేపిస్తుంది. ఇందులో భాగంగా సుమారు సంవత్సరం కిందట నిందితుడు మృతురాలికి పరిచయం అయ్యిండు. ఒకరి ఫోన్ నెంబర్ ఒకరు తీసుకున్నారు వాళ్లు తరచుగా ఫోన్లో మాట్లాడుకునేవాళ్లు నిందితుడు కూడా కూలి పని చేసుకుంటూ ఉంటాడు.
వీళ్ళ పరిచయంలో చనువుగా ఉండటం వాళ్ళు అప్పుడప్పుడు నిందితురాలు వెంకటమ్మ నుండి డబ్బులు అడుక్కునేవాడు అలా పరిచయం ఎక్కువ అయింది. వెంకటమ్మ ఎటైనా బయటికి వెళ్లాలి అనుకున్నప్పుడు నిందితుడు వీరన్న తనని బైక్ పైన తీసుకెళ్లడం మరియు ఇంటి దగ్గర దింపడం జరిగింది. ఈ క్రమంలో నిందితుడు సాగాల వీరన్నకు ఆగస్టు 31వ తేదీన డబ్బులు అవసరం ఉన్నది. నిందితుడు వెంకటమ్మకు ఫోన్ చేసి డబ్బులు అడిగినప్పుడు నేను రేపు బంగ్లాకు వస్తున్నాను రమ్మని నిందితుడుకి చెప్పడం జరుగుతుంది. నిందితుడు తన ఫ్రెండు బైక్ను తీసుకొని మరిపెడ బస్టాండుకు చేరుకొని ఆమెను బండిమీద ఎక్కించుకొని పాతర్లపాడు పురుషోత్తమగుడెం శివారు నేర స్థలానికి చేరుకుంటారు.
నిందితుడు మద్యం సేవిస్తుండగా డబ్బులు ఇవ్వాల్సిందిగా అడగగా నా దగ్గర డబ్బులు లేవని వెంకటమ్మ చెప్పడంతో ఆగ్రహానికి లోనై అదే క్రమంలో బీరు సీసన్ పగలగొట్టి ఆమె తలపై దాడి చేశాడని తెలిపారు. అనంతరం ఆమె స్కార్పుతోనే ఆమె గొంతును బిగించి హతమార్చి పక్కనే ఉన్న నీటి గుంటలో పడేసి నగలతో పరారయ్యాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో హత్య కేసును నమోదు చేశారు సిఐ రాజ్ కుమార్ గౌడ్ బృందం హత్య కేసును చాకచక్యంగా వారం రోజుల్లో చేదించడం జరిగింది. మరిపెడ సిఐ రాజకుమార్, ఎస్సై బోలగాని సతీష్, కానిస్టేబుల్ రమేష్, స్వామి వేణు, మహేష్, రమ్య, శాంత, సందీప్ (డ్రైవర్ల)ను డిఎస్పి కృష్ణ కిషోర్ అభినందించడం జరిగింది.