11 July, 2026 | 8:35 PM

Breaking News

జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •  

కుభీర్ లో ఘనంగా వినాయక నిమజ్జనం

07-09-2025 07:10 PM

కుభీర్: నిర్మల్ జిల్లా(Nirmal District) కుభీర్ మండల కేంద్రంలో వినాయక నిమజ్జనం కార్యక్రమం ఎంతో వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన శోభాయాత్ర ఆదివారం ఉదయం సుమారు 11 గంటలకు ముగిసింది. శ్రీ విఠలేశ్వర ఆలయం, యాదవ సంఘం, మున్నూరు కాపు సంఘం, అలాగే బృందావన్ కాలనీకి చెందిన వినాయక విగ్రహాలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. హారతులు, భజనలు, కోలాటాలతో శోభాయాత్ర కొనసాగింది. భక్తులు గంగమ్మ ఒడికి వినాయక విగ్రహాలను తీసుకెళ్లి అక్కడ పూజలు జరిపిన అనంతరం పెద్ద ఆనకట్ట వద్ద నిమజ్జనం చేశారు. యువజన సంఘాలు, యువక మండళ్లు, కాలనీ వాసుల సహకారంతో శనివారం రాత్రంతా శోభాయాత్ర ఉత్సాహంగా కొనసాగి ఆదివారం ఉదయం ఘనంగా ముగిసింది. 

ప్రత్యేక ఆకర్షణగా బృందావన్ కాలనీకి చెందిన వినాయక విగ్రహాన్ని రంగురంగుల అలంకరణలతో, ఎడ్ల బండిపై ఉంచి, మహిళలు భజనలు, పాటలు, కోలాటాలు చేస్తూ శోభాయాత్రను నిర్వహించారు. చిన్నారులు, మహిళలు నృత్యాలతో సందడి చేశారు. ప్రధాన వీధుల గుండా సాంప్రదాయ పద్ధతిలో శోభాయాత్ర సాగడం మండల ప్రజలను ఎంతో ఆకట్టుకుంది. అలాగే, పల్సిలోని శ్రీ విఠలేశ్వర, కాశీవిశ్వనాథ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినూత్నంగా ఎడ్ల బండిపై శోభాయాత్ర నిర్వహించిన బృందావన్ కాలనీ వాసులను మండల ప్రజలు అభినందించారు