07-09-2025 07:15:12 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): యువత సేవా మార్గంలో నడవాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గాధవేని మల్లేష్ అన్నారు. గంగాపుత్ర యువజన సంఘం అధ్యక్షుడు రూపేష్ ను ఆదివారం తన నివాసంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత సామాజిక దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. రాజకీయాల్లోనూ యువత రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండు ,సుభాష్, శ్రీరామ్, సోనేరావు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.