12-06-2025 10:48:40 PM
మేడ్చల్ అర్బన్: మేడ్చల్ పట్టణంలోని సాయిబాబా ఆలయంలో గురువారం ఏసీపీ శంకర్ రెడ్డి(ACP Shankar Reddy) ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధి బాలు యాదవ్ ఆహ్వానం మేరకు ఏసీపీ శంకర్ రెడ్డి పాల్గొని సాయిబాబాను దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఏసీపీ శంకర్ రెడ్డి పాల్గొని స్వయంగా భక్తులకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దాత్రిక సింహం,చంద్రశేఖర్ రెడ్డి,సాంబమూర్తి శ్రీనివాస్,సంతోష్,విటల్ తదితరులు పాల్గొన్నారు.