12-06-2025 10:50:18 PM
నిర్మల్ (విజయక్రాంతి): మంజులపూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు బుక్స్, ఉచిత ఏక రూప దుస్తులను పోషకులు, ఉపాధ్యాయుల సమక్షంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సిద్ధ పద్మ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... విద్యార్థులు ప్రతి రోజు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలని కోరారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివే అందరూ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్,ఏక రూప దుస్తులు, ఉదయం రాగి జావా మరియు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నదని తెలిపారు.
వారానికి మూడు రోజులు గుడ్లు కూడా అందిస్తు పరీక్షల సమయంలో రెండు నెలలు పదవ తరగతి విద్యార్థులకు ఉదయం మరియు సాయంత్రం అల్పాహారాన్ని కూడా అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా పనిచేస్తున్నాయని తెలిపారు.కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు హేమలత, సంతోష్ కుమార్, రాజేందర్, చట్ల శ్రీనివాస్, సురేందర్, మోరే శ్రీనివాస్,మసియుద్దీన్,ఆశలత, విద్యారాణి, సత్తయ్య, సునీత మరియు పోషకులు పాల్గొన్నారు.