19-06-2025 01:15:01 AM
తాడ్వాయి, జూన్, 18( విజయ క్రాంతి ): ప్రైవేటు పాఠశాలలో అధిక పీజుల వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఎంఈఓ రామస్వామి తెలిపారు కామారెడ్డి జిల్లా తాడువాయి మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో బుధవారం ఆయన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేయవద్దని సూచించారు విద్యా కమిటీ ఆదేశాల మేరకే పాఠశాల నిర్వహణ కొనసాగాలని కోరారు పాఠశాలలో పుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగులు, స్కూల్ యూనిఫాంలు అమ్మినట్లయితే చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు పాల్గొన్నారు