calender_icon.png 19 June, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతన్నకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

19-06-2025 01:17:56 AM

మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్

కామారెడ్డి   జూన్ 18,(విజయక్రాంతి) కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆవరణంలో  మండల అధ్యక్షులు అనంతరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సమావేశం నిర్వహించారు.

అనంతరం మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ మాట్లాడుతూ  తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు రైతు భరోసా పధకం క్రింద పంట పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో సకాలంలో జమ చేయడం  మరియు  రైతు నేస్తం  కార్యక్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ  రైతు భరోసా పధకం క్రింద డబ్బులు జమ అవుతాయని ప్రకటించి రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం.

ఎల్లప్పుడూ వుంటుందని ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూ యావత్ రైతాంగానికి తీపి కబురు   అందించి  రైతులకు ఆర్థ ప్రజా ప్రభుత్వ ఉద్దేశమని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తూ రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం వానాకాలం పంట సాగు ప్రారంభానికి  రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం ప్రజా ప్రభుత్వ పాలనకు నిదర్శనమన్నారు.

దోమకొండ మండలంలో 8659 పాస్ బుక్కులు   ఉండగా  6852 ఎకరముల పంట సాగు   చేయడం జరుగుతుందని,  8కోట్ల 22 లక్షల 29 వేల 62 1 రూపాయల రైతు భరోసా నిధులలో నుండి ఖాతాల్లోజూన్ 25 తారీఖున 9 రోజులలో రైతుల ఖాతల్లో పడతాయని తెలిపారు. కొత్త పాసుబుక్కులు ఉన్నాయో జూన్ 21 వరకు వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్లి నమోదు చేసుకుంటే వాళ్లకు కూడా రైతు భరోసా వస్తాయని  మాట్లాడారు.

మరియు దోమకొండ మండలంలో గల గ్రామాలలో 2లక్షల 50వేల 633 వందల  బస్తాల వరి ధాన్యం కొనుగోలు చేసి వారి ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగిందని ,సన్న వడ్లకు  500 బోనస్ ఇవ్వడం జరిగిందని. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని సందర్భంగా తెలిపారు.సకాలంలో పంట పెట్టుబడి సాయం అన్నదాతకు అందించడం ద్వారా విత్తనాలు, ఎరువులు వ్యవసాయపు అవసరాలను తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రైతుల్లో హర్షం వ్యక్తమవుతోందన్నారు జిల్లా రైతాంగం పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కి, మంత్రి వర్గానికి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీకి, టీ పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ లకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు సీతారామ మధు, చాముండేశ్వరి ఆలయ చైర్మన్ పెద్దిరెడ్డి సిద్ధారెడ్డి, ఆలయ ధర్మకర్త ఎల్లం రాములు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.