19-06-2025 01:09:31 AM
28న ప్రారంభించనున్న సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 18 (విజయక్రాంతి): కొండాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు అనుసంధానించే శిల్పా లేఔట్ ఫేజ్ ఫ్లుఓవర్ను ఈ నెల 28వ తేదీన సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తారు. ఈ ఫ్లుఓవరకు కార్మికనేత దివంగత పీ జనార్ధన్రెడ్డి పేరు పెట్టాలని సీఎం సూచించారు.
ప్రారంభోత్సవానికి ముందే పెయింటింగ్, సుందరీకరణతో సహా అన్ని పనులను పూర్తి చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ జీహెఎంసీ ఆర్వీ కర్ణన్ను ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి మట్లాడూతూ ఈ ఫ్లుఓవర్ ద్వారా ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ పౌరులకు నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తా మన్నారు.