calender_icon.png 7 June, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధిక చార్జీలు వసులు చేస్తే చర్యలు

07-06-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, జూన్ 6 (విజయక్రాంతి): జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ - 2010 నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయిలో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) చట్టం  2010, మహిళ శిశు రక్షణ చట్టాల అమలు, పర్యవేక్షణ అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్నారు. మహిళా శిశు రక్షణ చట్టాల అమలులో నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. ఆసుపత్రులు రోగుల నుండి అధిక చార్జీలు వసూలు చేయకూడదని, ప్రతి ఆసుపత్రిలో ధరల పట్టికను రిసెప్షన్ వద్ద స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. రోగులతో మర్యాదగా మాట్లాడే తీరు ఉండాలని కలెక్టర్ అన్నారు. ప్రతి ఆసుపత్రిలో కనీస ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, బయో మెడికల్ వేస్ట్‌ను సక్రమంగా నిర్వహించాలన్నారు.

జిల్లాలోని అన్ని ప్రైవేట్ వైద్య సంస్థలు, స్కానింగ్ సెంటర్లు, డయాగ్నొస్టిక్ ల్యాబ్‌లు తప్పనిసరిగా క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం కింద నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధంగా పనిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పీసీ మరియూ పిఎస్‌డీటీ చట్టం అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, లింగ నిర్ధారణకు పాల్పడే వారిపై నిఘా పెట్టాలని సూచించారు. సంబంధిత చర్యలకు పాల్పడే వారిపై ఫిర్యాదు చేసేందుకు ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ 7337448722ను సంప్రదించాలని సూచించారు.

ఆన్లైన్ మానిటరింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్నారు. రోగులకు సంబంధించిన అన్ని వివరాలను అన్‌లైన్‌లో సమయానికి అప్డేట్ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అనంతరం పీసీ మరియూ పీఎన్‌డీటీ చట్టం, అమ్మ రక్ష పోస్టర్లను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.రాజేందర్, వైద్యులు గోపాల్ సింగ్, సురేష్, సరోజ, సునీల్, ప్రైవేట్ వైద్య సంస్థల ప్రతినిధులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ల్యాబ్ల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

పిల్లలు మంచిగా చదువుకోవాలి

సారంగాపూర్ (విజయక్రాంతి): పిల్లలు బాగున్నారా ప్రతిరోజు పాఠశాల కు రావాలి మంచిగా చదువుకోవాలి అం టూ కలెక్టర్ అభిలాష అభినవ్ బడిబాటలో పాల్గొన్న పిల్లలను ప్రోత్సహిం చారు. శుక్రవారం సారంగాపూర్ మం డలంలోని యాకర్‌పల్లిలో నిర్వహించి న బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు.  పాఠశాలలో మొక్కలు నాటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కావలసిన సదుపాయాలు అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ మండల అధికారులు పాల్గొన్నారు.