30 August, 2026 | 10:36 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా కార్యాచరణ రూపొందించాలి

21-03-2025 12:41 AM

జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్

గద్వాల, మార్చి 20 ( విజయక్రాంతి ) : లే అవుట్ల అభివృద్ధి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా కార్యాచరణ రూపొందించి, సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం అయిజ మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్లు 751,957 ప్రాంతాల్లో లే అవుట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రాంతాల్లో లేఅవుట్ను స్వయంగా పరిశీలించిన కలెక్టర్,నీటి వనరుల అభివృద్ధి, అప్రోచ్ రోడ్డు ఏర్పాటు,విద్యుత్ సరఫరా మరియు డ్రెయినేజ్ కనెక్షన్లను సమగ్రంగా అందుబాటులోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లేఅవుట్కు సంబంధించిన భూమిని పర్యవేక్షించి,ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మంజూరు ప్రణాళికను సిద్ధం చేసి,అభివృద్ధి పనులను పూర్తి స్థాయిలో వేగంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

అభివృద్ధి పనుల్లో నాణ్యత,పారదర్శకత పాటిస్తూ, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస రావు మున్సిపల్ కమిషనర్ రాజయ్య,టౌన్ ప్లానింగ్ అధికారి కుర్మన్న,తహసీల్దార్లు జ్యోతి, టిపిఒ వరప్రసాద్,ఎ.ఈ లు,తదితరులు పాల్గొన్నారు.