పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్
30-08-2026 07:56 PM
వాటర్, కూల్డ్రింక్స్ పంపిణీ
పటాన్ చెరు, ఆగస్టు 30: వీరశైవ లింగాయత్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 19వ వార్షిక పాదయాత్ర సందర్భంగా భక్తులకు పిఎఆర్ టీమ్ సభ్యులు పటాన్చెరు మహారాజ్ కేఫ్ దగ్గర పాదయాత్రలో పాల్గొన్న భక్తులకు వాటర్, కూల్డ్రింక్స్ పంపిణీ చేశారు. పాదయాత్రలో పాల్గొన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి అవసరమైన ఆహార, పానీయాలను అందిస్తూ పిఎఆర్ టీమ్ సభ్యులు సేవాభావాన్ని చాటుకున్నారు. సభ్యులు మాట్లాడుతూ.. భక్తులకు సేవ చేయడం ఎంతో సంతృప్తినిచ్చే విషయమని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.






