calender_icon.png 18 September, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కొరతను తీర్చండి

18-09-2025 12:13:03 AM

ఈ ఖరీఫ్ సీజన్‌కు అనుకూలంగా విత్తనాలు వేయడమే కాదు, పంట ఎదుగుదల కీలకదశలో ఉంది. పత్తి పూత దశలోకి, వరి పొట్ట దశలోకి వచ్చింది. ఇలాంటి సమయంలో రైతులకు యూరియా అందకపోవడం ఆందోళనకర అంశం. యూరియా బస్తాల కోసం రైతులు క్యూలో నిలబడి చేతిలో ఆధార్, పాస్‌బుక్కులు పట్టుకొని ఎదురుచూస్తున్నారు. ఇన్ని రోజులు గడుస్తున్నా ఎక్కడా ఒక యూరియా బస్తా రైతులకు దొరకడం లేదు.

దీనిపై అటు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. తెలంగాణలోని 17 మంది లోక్‌సభలో సభ్యులుగా ఉన్నప్పటికీ రైతులు యూరియా కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని పార్లమెంట్‌లో స్పష్టంగా చెప్పడంలో మూ కు మ్మడిగా విఫలమయ్యారు. దేశానికి రైతు రాజు అంటారు. మరి కష్టాల్లో ఉన్న రైతన్నలను ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఎప్పుడు ముందుకు రావా అనే ప్రశ్న ఎదురువుతోంది.

ఇప్పుడు రైతులకు కావాల్సింది యూరియా, పండించిన పంటకు కనీస మద్దతు ధర, పంట నష్టపోతే పరిహారం. కానీ ఇవన్నీ మాటలకే పరిమితమవుతున్నాయి. రైతన్నకు ప్రభుత్వమే అండగా నిలబడాల్సిన అవ సరముంది. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం ఆ పరిస్థితులు కనబడటం లేదు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వ మౌనం రెండూ కలిసి రైతులను కష్టాల ఊబిలోకి నెట్టివేస్తున్నాయి. యూరియా కొరతను తీర్చే విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రైతుల ఆగ్రహం ఒక ఉద్యమంలా మారే అవకాశముంది. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సరిపడా యూరియాను సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలి.  

      రవీందర్, మహబూబ్‌నగర్