19-05-2025 11:00:35 AM
వైరా,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ బి. హుస్సేన్, ఖమ్మం ప్రముఖ న్యాయవాది బి. రమేష్ లు ఆదివారం ప్రముఖ ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, పామిస్ట్ డాక్టర్ గండు హరి కిషోర్ గౌడ్ ను వైరాలోని ఆయన స్వగృహంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆస్ట్రాలజీ న్యూమరాలజీ విభాగాల్లో ఎన్నో అవార్డులు బుక్ ఆఫ్ రికార్డ్స్ ను అందుకున్న డాక్టర్ గండు హరికిషోర్ గౌడ్ ను అభినందినందించారు. హనుమత్ మాల 41 రోజుల దీక్షలో ఉన్న ఆయనకు శుభాకాంక్షలు తెలిపి ఆ భగవంతుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఉండాలంటూ ఆ దేవుని వేడుకున్నారు . ఆస్ట్రాలజీ రంగంలో గండు హరికృష్ణ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.