23-08-2024 12:00:00 AM
భూమిని, ప్రకృతిని నమ్ముకొని ఆదివాసీ- గిరిజనులు జీవిస్తుంటారు. ప్రకృతిని ఆరాధిస్తూ, ప్ర కృతి సంరక్షకులుగా కొండలు, కోనలనే నిలయాలుగా చేసుకొని బతుకుతున్నారు. విలక్షణమైన జీవనం మాదిరిగానే, విలక్షణమైన ఆచార సంస్కృతులకు చిరునామా దారులు ఆదివాసులు. మూల సంస్కృతి ఆచారాలను పాటిస్తూనే కాలానుగుణంగా వస్తున్న ఆధునిక మార్పుల్లో భాగస్వాములవుతున్నారు. ఆధ్యాత్మికతకు, భక్తికి ఉన్న భేదాలు తెలియని ఈ గిరిజనులకు తెలిసిందల్లా నమ్మకంతో ముడిపడ్డ భక్తి మా త్రమే. సాధారణ పరిజ్ఞానం, మౌఖిక సా హిత్యం వల్ల, ఆధ్యాత్మిక చింతనలు, పునర్జన్మలు, ముక్తి మార్గాలు వంటివేవీ వారికి తెలియదు.
బతికినన్ని రోజులు ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా జీవించడం మాత్రమే వారికి కావాలి. వారికి గల నిండైన కృతజ్ఞత, విశ్వాసాల సాక్షిగా నిరాకారులైన వా రివారి కుల, గ్రామ దేవతలను గౌరవించుకుంటూ మొక్కులు చెల్లించుకుని జీవిస్తుం టారు. వ్రతాలు, నోములు, పూజలు, మం త్రాలు తదితర వాటితో వారికి అవసరం లేదు. వాటిని ఆచరించి అంతులేని పు ణ్యం, సంపదలు రావాలనీ వారు కోరుకోరు. అనారోగ్యం పాలైతే తెలిసిన మూలి క వైద్యం చేసుకోవడం, మనోధైర్యం కోసం గోరవాడు దగ్గరకు వెళ్లి అక్కడ చెప్పే ధైర్యపు మాటలు, చర్యలద్వారా మనోధై ర్యం పెంచుకొని జబ్బుల బారినుండి బ యట పడుతుంటారు. పంటలు బాగా పం డాలని గ్రామదేవతలను వేడుకొంటారు.
ఒక రకంగా గిరిజనుల భక్తిభావనలో కేవ లం నమ్మకం, కృతజ్ఞతలు తప్ప ప్రతిఫలాపేక్ష ఏ మాత్రం ఉండదు. వ్యవసాయ ప నులు మెదలుపెట్టే ముందు విత్తానాల పండుగ చేసిన తర్వాత సాగుచర్యలు చేపడతారు. విత్తనాలు, వరినాట్లు పూర్తయిన తర్వాత కొరకొత్త పండుగ చేస్తారు. పండిన పంటను ఇంటికి తీసుకుని వచ్చే సమయంలో సీతాలు పండుగ చేసి పండిన పంటను ఇంటికి తీసుకొని వస్తారు. అప్పు డు పంట భూమిలోనే కుటుంబీకులకు, నేస్తాలకు, గ్రామస్తులకు భోజనాలు పెడుతారు. ఈ పండుగలకు గ్రామదేవుళ్లయిన రాజులబాబు, పోతురాజులు, శంఖుదేవుడు, వేమనబాబు, గంగాలమ్మ తల్లి, పో లేరమ్మ, నూకాలమ్మ, జాంకరమ్మ తదితర దేవుళ్లను పూజిస్తుంటారు. వీరికి ఒక గుడి, ఒక రూపం అంటూ ఉండదు. ఊరి పొలిమేరల్లో, ఊరి మధ్యలో ఒక్క చెట్టుకింద ఓ రాయిని పెట్టి పూజిస్తారు. ఇది ఒకనాటి గిరిజనుల భక్తి భావనల తీరు.
కాలంతోపాటు వస్తున్న మార్పులు
నేటి ఆధునిక కాలంలో వస్తున్న మా ర్పుల్లో భాగంగా వీరి భక్తి విధానాలలో మార్పులు వస్తున్నాయి. గిరిజనులలో సంస్కారం, దేశభక్తి, దైవభక్తి పెంపొందించే క్రమంలో వనవాసీ కళ్యాణ పరిషత్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆధునిక దైవాలైన శ్రీరాముడు, ఆంజనేయులు, గణపతి, దుర్గామాత, వేంకటేశ్వరస్వామి, అయ్యప్పలను పూజిస్తున్నారు. మాల ధారణలు, దీక్షలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఇటీవల గిరిజన గ్రామాల్లో గణేష్ మండపాలు వెలుస్తున్నాయి. గ్రామస్థులంతా చందాలు వేసుకుని పూర్తి ఆధునిక పద్ధతుల్లో పూజలు నిర్వహిస్తున్నారు.
నవరాత్రులు మొత్తం పూజలు చేసే ఆర్థిక స్థోమత లేక మూడు లేదా ఐదు రాత్రుల తో ముగించి నిమజ్జనం చేయడం, అనంతరం సామూహిక అన్న ప్రసాదం కార్యక్ర మాలు నిర్వహిస్తున్నారు. అయితే, నిమజ్జన శోభాయాత్రల్లో మాత్రం తమదైన డోలు వాయిద్యం, నృత్యాలతో గిరిజన సంప్రదాయపు ఊరేగింపులు నిర్వహిస్తూ తమ సంస్కృతిని చాటుకుంటున్నారు. ఇదే క్రమంలో సంక్రాంతినాడు శ్రీరామభజన చేస్తూ గిరిజన గ్రామాల్లో పల్లకి సేవలు చేస్తున్నారు. సమీప ప్రాంతాల్లో జరిగే శివరాత్రి నాటి శివ కళ్యాణం, వెంకటేశ్వర కళ్యాణం, శ్రీరామనవమి నాటి సీ తారామ కళ్యాణం, స్థానికంగా జరిగే వివిధ తీర్ధాలకు గిరిజనులు అధిక సంఖ్యలో వెళుతున్నారు. గిరిజనుల్లో అధికంగా సామూ హిక కార్యక్రమాలు, ప్రయాణాలు వుంటాయి.
మతమార్పిళ్లతో సమస్యలు
మద్యపాన వ్యసనం నుండి దూరమ య్యే సదుద్దేశంతోను, సాధారణ ఆరోగ్యం కోసం గిరిజన యువత అధికంగా అయ్య ప్ప, దుర్గమ్మ, శ్రీరామ దీక్ష మాలధారణ లు చేపడుతున్నారు. మరోవైపు క్రైస్తవ మతం వారు స్వదేశీ, విదేశీ సంస్థల ఆర్థిక సాయంతో గిరిజన ప్రాంతాలలో పాఠశాలలు ఏర్పాటు చేయడం, గిరిజనులకు వా రి అవసరాలకు తగ్గటుగా కొన్ని వస్తువులు ఉచితంగా ఇస్తూ గిరిజనులకు కొన్ని మం చి మాటలు, అలవాట్లు నేర్పుతూ, క్రైస్తవ మతంపై విశ్వాసం పెంచి వారిలో మత మార్పిడికి కృషి చేస్తున్నారు. విశ్వాస నిధులైన గిరిజనుల్లో కొందరు ఆర్థిక వెసులు బాటు, అనారోగ్యాల నుంచి స్వస్థత పొందే క్రమంలో ప్రభువు సేవకులై చర్చిలకు వెళుతున్నారు.
దరిమిలా ప్రతి గిరిజన గ్రామం లో చర్చిలు వెలుస్తున్నాయి. ఈ క్రమంలో క్రైస్తవంలోకి నెట్టబడ్డ గిరిజనుల పరిస్థితి చిత్రంగా తయారైంది. వారిదైన గిరిజన సంస్కృతికి సంబంధించిన కొత్తల పండు గ, విత్తనాల పండుగ, ఇతర పండుగలు వివిధ తెగలు, గోత్రాలకు నిర్దేశించిన ఇలవేల్పు పండుగలతోపాటు గ్రామ పండుగ లకు, జాతర్లకు దూరంగా వుండాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. చివరికి ఎవరైనా చనిపోయినప్పుడు గిరిజన సంప్రదాయ పద్ధతిలో చేయాల్సిన అంత్యక్రియలు, కర్మకాండలు కూడా పూర్తిగా క్రైస్తవ పద్ధతిలో చేయాల్సిన పరిస్థితులు ప్రస్తుతం గిరిజన గ్రామాల్లో ఉన్నాయి. వారికిగల ‘నమ్మకం’ అనే గుణమే వారిని ఈ బలవంతపు భక్తిభావాలవైపు అడుగులు వేయిస్తున్నది.
మనదైన గిరిజన సంస్కృతికి సంబంధించిన గ్రామదేవుళ్లను ఆదివాసీ వీరుల ను మాత్రమే పూజించుకోవాలనే చైతన్యం దిశగా గిరిజన సంఘాల ప్రయత్నాలు ము మ్మరం చేయవలసి ఉంది. అక్షరాస్యత ద్వా రా గిరిజనుల్లో వచ్చిన సామాజిక, ఆర్థిక మార్పులవల్ల జీవన విధానంలో చక్కటి మార్పు వచ్చింది. అది ఆనందదాయకమే. నేటి గిరిజన యువతలోని అక్షరాస్యత కేవ లం ఉద్యోగాలకోసం, ఆర్థిక వృద్ధికోసం మాత్రమేకాక తమదైన సంప్రదాయాలను, సంస్కృతులను, అస్తిత్వాన్ని సంరక్షించుకోవడానికి, తమ జాతి ప్రజలను చైతన్య పర చడానికి ఉపకరించాలి. ప్రభుత్వాల పరం గా ఎన్నో అవకాశాలు ముంగిట్లో ఉంటున్నాయి. కనుక, ఆదివాసులు భవిష్యత్తులో తమదైన ఆలోచన శక్తి, చైతన్యంతో ఉత్తమ జీవన విధానంతో కొనసాగి, సంస్కృతి సంరక్షకులై, సదా ఆరోగ్యాలతో సకల అభివృద్ధి సాధించాలని కోరుకుందాం.