ఎస్బీఐ చైర్మన్ను కలిసిన వ్యవసాయ వర్సిటీ వీసీ
03-12-2024 02:08 AM
వజ్రోత్సవాలకు ఆహ్వానించిన జానయ్య
హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం పరిధిలోని రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థి, స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీనివాసులు శెట్టిని వర్సిటీ ఉపకులపతి ఆల్దాస్ జానయ్య సోమవారం కలిశారు. ఈనెల 20, 21 తేదీల్లో నిర్వహించే వజ్రోత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానించారు.






