అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్
14-07-2026 05:52 PM
భిక్కనూర్: ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం కొంపల్లిలోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మాచారెడ్డి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు లోయపల్లి నర్సింగరావు ను భిక్కనూర్ మండలం కాచాపూర్ మాజీ సర్పంచ్ బైండ్ల భూపతి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కొంతసేపు మాట్లాడి ధైర్యం చెబుతూ త్వరగా ప్రజాసేవలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు.






