14-06-2025 01:27:45 AM
బ్లాక్ బాక్స్ లభ్యం
దర్యాప్తు వేగవంతం
అహ్మదాబాద్, జూన్ 13: అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ లభ్యమైంది. దీంతో ప్రమా దానికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఈ బ్లాక్ బాక్స్ వెల్లడించనుంది. విమానం ఢీకొట్టిన మెడికల్ కాలేజీ హాస్టల్ భవనం పైకప్పులో బ్లాక్ బాక్స్ దొరికినట్టు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) తెలిపింది.
ప్రమాదం జరిగిన 28 గం టల తర్వాత గుజరాత్కు చెందిన 40 మంది సిబ్బంది సాయంతో ఏఏఐబీ బృందం జరిపిన గాలింపు చర్యల్లో ఎట్టకేలకు బ్లాక్ బాక్స్ లభించింది. దీంతో దర్యాప్తును ముమ్మరం చేసిన ఏఏఐబీ బ్లాక్ బాక్స్లోని సమాచారాన్ని విశ్లేషించే పనిలో పడింది. సమాచారం బయటికి వస్తే ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునే అవకా శముం టుంది. ఘటనా స్థలిలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రెస్క్యూ ఆపరే షన్లో పాలుపంచుకుంటున్నాయి.
ఏమిటీ బ్లాక్ బాక్స్?
బ్లాక్ బాక్స్ అనేది విమాన పనితీరు, పైలె ట్ల మధ్య సంభాషణలను రికార్డు చేసే పరికరం. ఫ్లుటై డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ రెండు భాగాలను బ్లాక్ బా క్స్గా పరిగణిస్తారు. ఫ్లుటై డేటా రికార్డర్ ఎ త్తు, వేగం, ఇంజిన్ పనితీరు, ఫ్లుటై పాత్ డే టాతో సహా కీలకమైన టెక్నికల్ పారామీటర్స్ను నమోదు చేస్తుంది. ఇక కాక్ పిట్ వాయిస్ రికార్డర్ పైలట్ల మధ్య సం భాషణలు, ఏటీసీ నుంచి వచ్చే ఆదేశాలను సేకరిస్తుంది.
బ్లాక్ బాక్స్లు అత్యంత ధృడంగా ఉంటాయి. ఎంతటి ప్రమాదమై న తట్టుకునే శక్తి వీటికి ఉంటుంది. తీవ్ర ఉష్ణోగ్రతతను, నీటిలో పడినా కూడా త ట్టుకొని నిలబడగలదు. దీనిని టైటాని యం, స్టీల్ వంటి మెటీరియల్తో రూ పొందిస్తారు. అందుకే వెయ్యి డిగ్రీల సెల్సియస్ వేడినైనా ఇది సులువుగా తట్టుకునే అవకాశముంటుంది. శిథిలనారింజ కలర్లో మెరుస్తూ ఉంటే బ్లాక్స్ బాక్స్ 25 గంటల సమాచారాన్ని నిల్వ చేస్తుంది.
డీవీఆర్ లభ్యం.. ఫోరెన్సిక్ బృందం పరిశీలన
అంతకుముందు విమాన శిథిలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్)ను గుజరాత్ యాంటీ టెర్రర్ స్వాడ్ స్వాధీనం చేసుకుంది. అనంతరం ఫోరెన్సిక్ నిపుణులు డీవీఆర్పై తమ పరిశోధనలు కొనసాగిస్తూ ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. డీవీఆర్ అనేది విమానంలో భద్రత కోసం ఇన్స్టాల్ చేసే ఎలక్ట్రానిక్ పరికరం. విమానంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఇందులో రికార్డు అవుతుంది. అత్యున్నత సాంకేతితతో రూ పొందించిన డీవీఆర్ పరికరం ఎంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో అయినా పనిచేస్తుంది. ఈ పరికరం భద్రత, శిక్షణతో పాటు ఇతర అంశాల్లో ఈ డివైజ్ కీలకం కానుంది.
చెక్కుచెదరని భగవద్గీత
ఎయిరిండియా విమాన ప్రమాద స్థలంలో ‘భగవద్గీత’ లభించింది. అంత పెద్ద ఎత్తున మంటలు చెలరేగి నా కానీ భగవద్గీతకు ఏమీ కాకపోవడం గమనార్హం. ప్ర మాదానికి గురయిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానంలో ఒక్కరు మినహా ఎవరూ ప్రాణాలతో బయటప డలేదు. కానీ భగవద్గీతకు మాత్రం ఏమీకాలేదు. శుక్రవారం రోజు సంఘటనా స్థలంలో ఓ భగవద్గీత పుస్తకం లభించింది.
పుస్తకంలోని పేజీలకు కొంత కూడా నష్టం జరగలేదు. అక్షరాలు, చిత్రాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ‘ఆ గ్రంథం ఎవరైనా ప్రయాణికుడి వద్ద ఉండి ఉంటుంది. అంత వేడి వచ్చినా కానీ గ్రంథంలో ఉన్న చిన్న అక్షరం కూడా స్పష్టంగా కనిపించేలా ఉంది.’ అని ఇస్కాన్ స్థాపకుడు స్వామి ప్రభుపాద తెలిపారు.
ఎయిర్ ఇండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ, జూన్ 13: అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని బోయింగ్ 787 విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని ఎయిర్ ఇండియాను ఆదేశించింది. తనిఖీల అనంతరం నివేదిక ఇవ్వాలని పేర్కొంది.
విమానా లు బయల్దేరే ముందు ఇంధనం పర్యవేక్షణ, క్యాబిన్ ఎయిర్ కంప్రెసర్, ఎలక్ట్రానిక్ ఇంజిన్ నియంత్రణ వ్యవస్థ, హైడ్రాలిక్ వ్యవస్థ, టేకాఫ్ ప్రమాణాల పునఃపరిశీలన లాంటివి తప్పనిసరిగా చేపట్టాలని స్పష్టం చేసింది.
వీటితో పాటు ఫ్లుటై కంట్రోల్ ఇన్స్పెక్షన్ను ప్రవేశపెడుతున్నామని, ఇంజిన్ సామర్థ్యాలకు సం బంధించిన తనిఖీలను రెండు వారాల్లో పూర్తి చేయాలని సూచించింది. బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాల్లో గత పదిహేను రోజుల్లో తరచుగా సంభవించిన సమస్యలను వీలైనంత త్వరగా సమీక్షించుకోవాలని పేర్కొంది.