14-06-2025 01:19:32 AM
- విమాన ప్రమాదం ఊహించలేని పెను విషాదం
- ఘటనా స్థలిని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ
- సివిల్స్ ఆసుపత్రిలో బాధితులకు పరామర్శ
- మృత్యుంజయుడు విశ్వాస్ను కలుసుకున్న మోదీ
- అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో ఉన్నతాధికారులతో సమీక్ష
- విజయ్ రూపానీతో బంధం విడదీయలేనిది
అహ్మదాబాద్, జూన్ 13: అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన తన హృదయాన్ని ముక్కలు చేసిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎవరూ ఊహించలేని పెను విషాదమన్నారు. శుక్రవారం ఉదయం అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనా స్థలాన్ని శుక్రవారం ఉదయం ప్రధాని స్వయంగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కలియతిరిగిన మోదీ అక్కడి పరిస్థితులు, ప్రమాదానికి సంబంధించిన వివరాలపై ఆరా తీశారు.
అక్కడి నుంచి నేరుగా బాధితులను పరామర్శించేందుకు అహ్మదాబాద్ సివిల్స్ ఆసుపత్రికి వెళ్లారు. ప్రమాదం నుంచి బయటపడిన మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ రమేశ్ను ప్రత్యేకంగా పరామర్శించారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రానికి చేరుకున్న ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలిలో చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు.
విమాన ప్రమాదంలో మెడికల్ కాలేజీ హాస్టల్ భవనం ధ్వంసం కావడం, మెడికల్ విద్యార్థులు మృతి చెందడం తదితర అంశాలను ప్రధాని మోదీకి వివరించారు. ప్రధాని మోదీ వెంట కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి ఉన్నారు. విమాన ప్రమాద ఘటనలో ఇప్పటివరకు 269 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. 241 మంది విమానంలోని వారు కాగా.. మిగతా 28 మంది బీజే కాలేజీ మెడికల్ విద్యార్థులు కావడం గమనార్హం.
ఘటనా స్థలిలో కలియతిరిగిన మోదీ..
అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం మోదీ నేరుగా ప్రమాదం జరిగిన మేఘానీ నగర్కు వెళ్లారు. అక్కడ ఘటన జరిగిన స్థలంలో అధికారులతో కలిసి మొత్తం కలియతిరిగారు. ప్రమాదం జరిగిన తీరుకు సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలసుకున్నారు. అనంతరం విమాన ప్రమాదంలో ద్వంసమైన బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ను సందర్శించారు.
హాస్టల్ భవనంపై ఇరుకున్న విమాన శకలాలను పరిశీలించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. ఈ ఘటన పెను విషాదమని విచారం వ్యక్తం చేశారు. విమాన ప్రమాదం తనను కలచివేసిందని, బాధితుల బాధ వర్ణించరానిదని తెలిపారు. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబసభ్యులు, బంధువులు కోల్పోయిన వారి బాధ వర్ణానాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితులకు అండగా ఉంటాం
ఘటనా స్థలి నుంచి క్షతగాత్రులు చికిత్స పొందుతున్న అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వెళ్లారు. ప్రమాదంలో గాయపడిన వారిని ప్రధాని మోదీ పరామర్శించారు. బా ధితుల కుటుంబాకు దైర్యం చెప్పారు. గాయపడిన వారికి అందిస్తున్న చికిత్స గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ప్రమాదం నుంచి బయటపడిన మృత్యుంజయుడు విశ్వాస్ను కలుసుకున్న మోదీ ప్రమాద వివరాలను ఆరా తీశారు. ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డారన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపిన మోదీ గాయపడిన వారి కుటుంబాలకు కేంద్రం అండగా ఉంటుందన్నారు.
విజయ్భాయ్ మరణ వార్తను తట్టుకోలేకపోయా
గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూ పానీ విమాన ప్రమాదంలో మరణించారన్న వార్తను తట్టుకోలేకపోయానని మోదీ తెలిపారు. సివిల్స్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన అనంత రం ప్రధాని మోదీ విజయ్ రూపానీ ఇంటికి వెళ్లారు. విజయ్ రూపానీ మృ తికి ప్రగాడ సానుభూతి తెలిపిన మోదీ అనంతరం వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా రూపానీ తో ఉన్న జ్ఞాపకాలను మోదీ నెమరు వే సుకున్నారు.
తనకు దశాబ్దాలుగా ఆయనతో మంచి పరిచయం ఉందని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇద్దరం భుజం, భుజం కలిపి పనిచేశామని గుర్తుచేసుకున్నారు. అత్యంత సవాలుతో కూడిన సమయా ల్లో కూడా విజయ్ భాయ్ వినయపూర్వకంగా పనిచేసేవారని తెలిపారు. పా ర్టీ సిద్ధాంతానికి ధృడంగా కట్టుబడి ఉం డేవారని, ఉన్నత స్థాయికి ఎదిగి, వివిధ బాధ్యతలను నిర్వహించి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంతో శ్రద్ధాసక్తులతో సేవలందించారని కొనియాడారు.