27-07-2025 12:01:43 AM
జడ్చర్ల: జడ్చర్ల పట్టణంలోని అల్ఫా హోటల్ లో పరిశుభ్రత పాటించినందుకు నిర్వాహకుడు గోరేటి సూరికి జడ్చర్ల మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ నరేష్(Municipal Sanitary Inspector Naresh) రూ.5000 జరిమానా విధించారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ నరేష్ మాట్లాడుతూ.. పట్టణంలో ఆల్ఫా హోటల్ ను ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టడం జరిగింది. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా, పరిశుభ్రత లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారుచేసి జనాలకు విక్రయిస్తుండడంతో తనిఖీ నిర్వహించి జరిమానా విధించడం జరిగింది. మొదటి హెచ్చరికగా జారీచేశాం. ఆహార పదార్థాలు తయారు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న హోటల్ యజమాన్యాలు, రాబోయే వర్షాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ కృష్ణారెడ్డి, సానిటరి జవాన్ ప్రకాష్ తదితర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.