5 May, 2026 | 7:03 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

రైతులకు ఎల్లప్పుడూ యూరియా అందుబాటులో ఉంచాలి

26-07-2025 11:59 PM

డిసిఓ పద్మ..

సూర్యాపేట (విజయక్రాంతి): రైతులకు ఎల్లప్పుడు యూరియా అందుబాటులో ఉంచేవిధంగా చూడాలని డిసిఓ పద్మ(DCO Padma) అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో పిల్లలమర్రి ఎరువుల గోడౌన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాంలో ఉన్న నిల్వలను పరిశీలించి వాటికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... ఉదయం 8 గంటల లోపే షాపులు తెరవాలని సూచించారు. తదుపరి జిల్లాలో ఎరువులు అలాట్మెంట్ ఎంత, రైతులకు ఏ మేరకు విక్రయించారు, ప్రస్తుతం ఎంత అందుబాటులో ఉందనే వివరాలను వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పిఐసి అసిస్టెంట్ రిజిస్టర్ బి.అంజయ్య, సంఘ సెక్రెటరీ జె శ్యాంసుందర్ రెడ్డి, సంఘ సిబ్బంది వి.వెంకట్ రెడ్డి, వెంకటేష్, వెంకన్న, నవకాంత్, నాగరాజు, రైతులు పాల్గొన్నారు.