22 March, 2026 | 5:14 AM

మతాలకతీతంగా ఉద్యోగుదలంతా ఒకటే కుటుంబం

22-03-2026 12:00 AM

టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు 

ఖమ్మం, మార్చి 21(విజయక్రాంతి): రంజాన్ పర్వదిన సందర్భంగా నెలరోజులపాటు పవిత్ర ఉపవాస దీక్షను పూర్తి చేసు కుని ఈద్-ఉల్-ఫితర్ పండుగను చేసుకున్న ముస్లిం సోదరుల కుటుంబ సభ్యులను ఆదివారం టీజీఈజేఏసీ సెక్రటరీ జనరల్, టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు కలి సి శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా శ్రీనివాసరావు టీఎన్జీవో కాలనీలోని ఈద్గా ని సందర్శించి అభివృద్ధికి పలు సూచనలు చేశారు.

అనంతరం టీజీవో మాజీ అధ్యక్షు డు ఎస్కే ఖాజా మియా, ప్రొఫెసర్ ఎండీ జ కీరుల ప్రిన్సిపల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మై నార్టీ వెల్ఫేర్ జిల్లా అధికారి ఎండీ ముజాహిద్దీన్, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎస్‌కే అ లీం, టీఐజీఎల్‌ఏ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ నయం, డ్రైవర్ సంఘం హౌస్ బిల్లింగ్ సొసైటీ అధ్యక్షులు ఎస్ కే సలీం, తెలంగాణ మైనారిటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్.కె అస్లాం, వైస్ ప్రెసిడెంట్ గఫూర్, ఎస్‌టీఓ షబ్బీర్ పాషా, షామీద్దీన్, పాషా మీయ, యాకూబ్ పాషా కమర్షియ ల్ టాక్స్ డిపార్ట్మెంట్, డీపీఓ సలీం, ఖమ్మం జిల్లా వివిధ ఉద్యోగ సంఘ బాధ్యుల ము స్లిం కుటుంబాలను సందర్శించారు.

ఈ సందర్భంగా ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ పవిత్ర మాసంతో, ప్రతి ఒక్కరూ మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాలని తోటివారి పట్ల సోదరి భావాన్ని కరుణ సహాయ గుణాన్ని అలవర్చుకోవాలని పేర్కొన్నారు.  కార్యక్రమంలో టీఎన్‌జీఓ అధ్యక్షులు గుం టుపల్లి శ్రీనివాస్, టీజీఓ కార్యదర్శి శ్రీ మో దుగు వేలాద్రి, టీజీఓ కోశాధికారి సూరంపల్లి రాంబాబు, హౌస్ బిల్డింగ్ సొసైటీ సెక్రటరీ డా.పి. విజయ్ కుమార్, టీఎన్‌జీఓ రాష్ట్ర కార్యదర్శి జెడ్.ఎస్. జైపాల్, టీఎన్‌జీవో సంయుక్త కార్యదర్శి, బి. చంద్రశేఖర్, ఇ. కోనార్, హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రుక్మారావు, డ్రైవర్స్ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు , మాజీ అధ్యక్షులు కోటేశ్వరరావు, కార్యదర్శి గోపాల్ రావు, టీఎన్జీవోస్ నాయకులు ఎర్ర రమేష్ , హనుమ కొండ మెడికల్ అండ్ హెల్త్ ఏవో రమేష్ బాబు, ఖమ్మం జిల్లా డ్రైవర్స్ సంఘ కార్యవ ర్గ సభ్యులు, అధ్యాపకులు కిరణ్ కుమార్, వెంకన్న, శ్రీనివాస రావు, నాగేశ్వరరావు,తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.