9 June, 2026 | 3:54 PM

Breaking News

ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన కార్పోరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు   •   వైద్య సేవల్లో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ కె.హరిత   •   ఆర్అండ్‌బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు   •   రానున్న రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు   •   స్టేషన్ ఘన్‌పూర్‌లో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి   •   ఎప్టీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం... పరిశ్రమల ద్వారా పెద్దఎత్తున ఉపాధి   •   విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్   •   గచ్చిబౌలిలో భారీ చోరీ.. ఇద్దరు నిందితులు అరెస్ట్   •   ఖమ్మంలో బాలికపై లైంగిక దాడి   •   తాటి చెట్టు పైన గుండెపోటుతో వెంకన్న మృతి   •  

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు

15-11-2025 12:20 AM

- కలెక్టర్ దీపక్ కుమార్ 

బెల్లంపల్లి, (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించి నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం బాలల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని కాసిపేట మండలం పెద్దనపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో త్రాగునీరు, విద్యుత్ సౌకర్యాలతో పాటు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులకు బోధన అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.

ఉన్నత చదువులకు పాఠశాల విద్య పునాది వంటిదని విద్యార్థులకు ఏకాగ్రత, క్రమశిక్షణ అలవాటు చేయాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల పై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పిల్లల ప్రవర్తన ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు. ఉపాధ్యాయులు సమన్వయంతో పిల్లల భవిష్యత్తుకు మంచి బాటలు వేయాలని సూచించారు. పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి సహాయపడాలని, ఖాళీ సమయాల్లో విద్యార్థులకు చదువు పై అవగాహన పెంచాలని కోరారు. పూర్వ విద్యార్థి గుర్రం రాజేష్ గౌడ్ తన సొంత ఖర్చులతో పాఠశాలలో బోరు, ప్రహరీ, త్రాగునీటి సదుపాయిని కల్పించడం అభినందనీయమని చెప్పారు.