calender_icon.png 8 February, 2026 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరంతరం ప్రజలతోనే ఉంటా

08-02-2026 12:00:00 AM

గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

సుల్తానాబాద్ ౪వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బిరుదు రాధాకృష్ణ

సుల్తానాబాద్, ఫిబ్రవరి 7(విజయక్రాంతి): స్వర్గీయ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కుమారుడిగా నిరంతరం ప్రజల్లో ఉండే నాయకుడిగా సుల్తానాబాద్ మున్సిపల్ 4వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న తనను పెద్ద మనసుతో ఆశీర్వదించి చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని బిరుదు రాధాకృష్ణ ఓటర్ దేవుళ్లను వేడుకుంటున్నారు,నాలుగో వార్డు పరిధిలోని ప్రతి వీధి, ప్రతి కుటుంబం వద్దకు చేరుకుంటూ ఈసారి అవకాశం కల్పించండి.. పాలకుడిగా కాదు.. సేవకుడిగాపెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సహకారంతో నిరంతరం ప్రజల్లో ఉంటూ మీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ సేవచేస్తానని తనకు ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నారు.

నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారంతోపాటు అభివృద్ధి , సంక్షేమం పట్ల అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు, గత మున్సిపల్ ఎన్నికల్లో మీరు చూపిన ఆదరణతో నా సతీమణి బిరుదు సమతకృష్ణ ఇదే వార్డులో కౌన్సిలర్ గా విజయం సాధించి మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌గాప్రజలకు సేవలందిస్తూ, అన్ని వర్గాల అభిమానాన్ని సంపాదించారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ ఒక అవకాశం ఇచ్చి ఇంకో మెట్టు ఎక్కేలా మీరందరూ దీవించాలని బిరుదు రాధాకృష్ణ ప్రతి ఒక్క ఓటర్ దేవున్ని వేడుకుంటున్నారు.