12 March, 2026 | 10:52 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

అంబేద్కర్ ఆశయాలు నేటికీ స్ఫూర్తిదాయకం

06-12-2025 08:54 PM

బహుజన సేన నేతలు..

వేములవాడ (విజయక్రాంతి): వేములవాడ పట్టణంలో బహుజన సేన రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ “డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భౌతికంగా లేకున్నా, భారత రాజ్యాంగ రూపంలో అంబేద్కర్ బ్రతికే ఉన్నారు. సమాన హక్కుల కోసం వారి కుటుంబాన్నే త్యాగం చేసిన మహనీయుడు బాబాసాహెబ్” అని పేర్కొన్నారు. సమాజం ఆయన ఆశయాలను ఆచరించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిలుక రమేష్, పిట్ల సతీష్, గుడిసె మనోజ్ కుమార్, జింక శ్రీధర్, సుంకపాక వినయ్, మల్లారం హరీష్, నేదూరి రాజు, శ్రీకాంత్, నాగేష్, రాము తదితరులు పాల్గొన్నారు.