అమెరికా సంచలనం
హోస్టన్: అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న అమెరికా సంచలనం నమోదు చేసింది. స్వదేశంలో జరగనున్న పొట్టి ప్రపంచకప్నకు ముందు బంగ్లాదేశ్పై టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో మ్యాచ్లో అమెరికా 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తుచేసింది. తద్వారా తొలి మ్యాచ్ విజయం గాలివాటం కాదని నిరూపించడంతో పాటు మరో మ్యాచ్ మిగిలుండగానే 2 సిరీస్ పట్టేసింది. మొదట అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. మోనాంక్ పటేల్ (38 బంతుల్లో 42, 4 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ఆరోన్ జోన్స్ (34 బంతుల్లో 35) పర్వాలేదనిపించాడు. బంగ్లా బౌలర్లలో షరీఫుల్, ముస్తఫిజుర్, రిషాద్లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. నజ్ముల్ (34 బంతుల్లో 36), షకీబ్ (23 బంతుల్లో 30) పోరాడినా ఫలి తం లేకపోయింది. అమెరికా బౌలర్లలో అలీ ఖాన్ 3 వికెట్లు తీయగా.. సౌరబ్, షాడ్లీలు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.






