calender_icon.png 15 June, 2025 | 1:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా బడిబాట కార్యక్రమం

10-06-2025 04:48:34 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం(Prof. Jayashankar Badi Bata Programme)లో భాగంగా మహబూబాబాద్ జిల్లా(Mahbubabad District) కేసముద్రం స్టేషన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేసముద్రం స్టేషన్ ఉపాధ్యాయ బృందం కేసముద్రం పట్టణంలో బడిబాట ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ బడిలో విద్యార్థులకు అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలతో రూపొందించిన కరపత్రాలు అందజేశారు.

వీరితో పాటు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల బృందం బడిబాట సంబంధించిన పాటలు పాడి ప్రధాన కూడళ్ళలో బడిబాట కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ బడిలో అందించే సౌకర్యాలు కంప్యూటర్ విద్య, డిజిటల్ బోధన టిఎల్ఎం ఎన్.ఎం.ఎం.ఎస్ ఉపకార వేతనము, ప్రీ మెట్రిక్స్ స్కాలర్షిప్, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, అల్పాహారం, రాగిజావ ఉచిత బుక్స్, నోట్ పుస్తకాలు వంటి విషయాలను వివరించారు. అలాగే కేసముద్రం పాఠశాల మండలంలోని పీఎం శ్రీ పథకం కింద ఎంపికైన ఏకైక పాఠశాల కావున ఈ పథకం కింద ప్రతి సంవత్సరము ఒక ఫీల్డ్ విజిట్ ఒకటి విజ్ఞాన విహారయాత్ర ట్విన్నింగ్ స్కూల్, ఇతర చాలా సౌకర్యాలు అందిస్తున్నట్టు తెలిపారు.

కేసముద్రం స్టేషన్ ఉన్నత పాఠశాల అత్యుత్తమ మార్కులు సాధించి మంచి ఫలితాలు పొందడం జరిగిందని, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అనుభవజ్ఞుల ఉపాధ్యాయులచే బోధిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఆజాద్ చంద్రశేఖర్, మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.రాజు , ఉపాధ్యాయులు శ్రీనివాస్, కుమారస్వామి నరసింహారెడ్డి, కృష్ణవేణి, మధు, మదన్మోహన్, శ్రీనివాసులు, ముదిగిరి సదయ్య, సురేష్, విజయ్ చందర్, లక్ష్మి కుమారి, భద్ర సింగ్, శ్రీవిద్య, నాగయ్య, రాజేందర్, జ్యోతి, సత్యనారాయణ పాల్గొన్నారు.