17 June, 2026 | 11:08 AM

Breaking News

మంత్రులు అడ్లూరి, వివేక్ కు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •   అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్   •   పానీ పూరి తిన్న చిన్నారులు అస్వస్థత.. 10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక   •   పేరుకే ఎమ్మార్సీ భవనం.. వసతులు శూన్యం   •  

ఆకట్టుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

09-11-2025 08:33 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలో బెల్లంపల్లిలోని జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్(ZPHS) లో 1975 నుంచి 1988 వరకు చదివిన ఎస్ఎస్సి బ్యాచ్ (SSC BATCH) పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. 14 ఎస్ ఎస్ సీ (SSC) పూర్తి చేసిన బ్యాచ్ (BATCH) విద్యార్థులు ఒక చోటుకు చేరి ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. రోజంతా ఆనందోత్సవాల మధ్య గడిపారు.

అనంతరం ఆనాటి గురువులు(TEACHERS), ప్రధానోపాధ్యాయు(HM)లు కస్తూరి దేవరాజ్, డైనా, కళావతి, సరోజ లక్ష్మి, కమల కుమారి, స్వర్ణలత, కాంతయ్య, రాజయ్య, రామ్ రెడ్డి, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, ప్రేమ్ సాగర్ లను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులు భాగ్యలక్ష్మి, జయశీల, వంగల సత్యవతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 14 బ్యాచ్ ల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.