సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ వినూత్న కార్యక్రమం
చిట్యాల,(విజయక్రాంతి): తెలుగింటి సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ సంక్రాంత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చిట్యాల పట్టణ కేంద్రంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం వినూత్న కార్యక్రమం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో భోగి, సంక్రాంతి, కనుమ పండుగ పర్వదినాలను అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహిస్తారు.
మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపాలైన భోగిమంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు విన్యాసాలు, గొబ్బెమ్మ పాటలు వంటి కార్యక్రమాలు మంగళవారం శ్రీ కనకదుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ చరిత్రలో తొలిసారిగా ఈ కార్యక్రమాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ తరం మర్చిపోతున్న సంస్కృతి సంప్రదాయాలను తిరిగి ముందు తరాలకు తెలిసేలా కార్యక్రమాలను చేపట్టారు.




