29-01-2026 12:00:00 AM
హనుమకొండ టౌన్, జనవరి 28 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో సర్పంచి గుంటి రేణుక వెంకట్ విలేజ్ క్యాబినెట్ ఏర్పాటు చేశారు. గ్రామ సమస్యలు, అభివృద్ధి పరిష్కరించేందుకు, సేవలు అందిం చేందుకు అవసరానికి అనుగుణంగా పలు శాఖలు 12 మంది వార్డు సభ్యులకు కేటాయించారు. విద్యుత్, పాఠశాల విద్యా, వైద్యరోగ్యం, పంచాయతీరాజ్, రోడ్లు, పౌరసరఫరాలు, మహిళా సంక్షేమం, శిశు సంక్షే మం, అంగన్వాడీ, నీటిపారుదల, మత్స్య సంపద, కార్మిక ఇతర శాఖలను ఏర్పాటు చేశారు.
అనంతరం సర్పంచ్ రేణుక వెంకట్ మాట్లాడుతూ గ్రామంలోని పలు సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఈ శాఖల ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామంలోని ప్రజలు సర్పంచి తీసుకున్న నిర్ణయా నికి, మేము సహకరిస్తామని, ఎంతో ఆనందదాయకంగా ఉందని, రానున్న రోజుల్లో మా గ్రామాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోయే విధంగా ఉన్నాయని అన్నారు.