12-06-2025 07:42:49 PM
మందమర్రి (విజయక్రాంతి): 10 సంవత్సరాల లోపు చిన్నారుల బంగారు భవితకు పునాదులు అంగన్వాడి కేంద్రాలను వీటిని సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల టి డబ్ల్యూ రవూఫ్ ఖాన్(T.O. Rauf Khan), సిడిపిఓ విజయలక్ష్మి(CDPO Vijayalakshmi)లు అన్నారు. పట్టణంలోని విద్యానగర్ సెక్టర్ లో నాలుగవ కేంద్రం, ఒకటవ జోన్ లోని మూడవ కేంద్రంలోని అంగన్వాడి కేంద్రాలలో గురువారం అంగన్వాడి బడిబాట కార్యక్రమం ప్రారంభించి ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంగన్వాడీలో నూతనంగా చేరిన పిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రెండున్నర సంవత్సరాల పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని, అంగన్వాడీ కేంద్రాలు అమ్మ ఒడిలాంటివని, పిల్లల భవిష్యత్తుకు పునాదులు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సరిత, అంగన్వాడి టీచర్లు, ఆయమ్మలు, పిల్లల తల్లితండ్రులు పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.