calender_icon.png 15 June, 2025 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని వినతి

14-06-2025 12:00:00 AM

సూర్యాపేట, జూన్ 13 (విజయక్రాంతి) : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనీ, ప్రయివేట్ పాఠశాలలు వసూలు చేస్తున్న అధిక ఫీజులను అరికట్టాలని కోరుతూ తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు మాట్లాడుతూ ప్రజల ప్రాధమిక హక్కు, ప్రభుత్వం  కనీస బాధ్యత అయిన ఉచిత నాణ్యమైన విద్యను  ప్రభుత్వం అమలు చేయాలన్నారు.

అనుమతుల లేకుండా నిర్వహిస్తున్న ప్రయివేట్ పాఠశాల యాజమాన్యల పై, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడే విధంగా ఫిట్ నెస్ లేని మరియు సేఫ్టీ లేకుండా రోడ్ల పైకి విద్యార్థులతో వస్తున్న  ప్రయివేట్ విద్యాసంస్థల వాహనాల పై, యాజమాన్యలపై  చర్యలు తీసుకోవాలని అన్నారు.

దేవిధంగా అధిక ధరలకి  బుక్స్, స్టేషనరీ అమ్ముతున్న ప్రయివేట్ పాఠశాల యాజమాన్యల పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో రాష్ట్ర నాయకులు భాషిపంగు సునీల్, సంఘము జిల్లా అధ్యక్షులు పోరెళ్ల విప్లవ్ కుమార్, టి ఆర్ వి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు బంటు సందీప్, శిలోజు గౌతమ్ చారి, శివ నాయక్ తదితరులు ఉన్నారు.