18 August, 2026 | 1:24 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

చినూర్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ప్రత్యేక శిబిరం

08-05-2026 04:33 PM

నాగిరెడ్డిపేట్, (విజయక్రాంతి): మండలంలోని చినూర్ గ్రామంలో శుక్రవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఫెర్టిలిటీ అండ్ యానిమల్ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని మండల పశువైద్యాధికారి రవికుమార్ తెలిపారు.ఈ సందర్భంగా మండల పశువైద్యాధికారి రవికుమార్ హీట్‌వేవ్ ప్రభావం,పశువుల సంరక్షణ,హీట్ మేనేజ్‌మెంట్‌పై రైతులకు అవగాహన కల్పించారు.

అలాగే దూడల ర్యాలీ (కాల్ఫ్ ర్యాలీ) నిర్వహించి గ్రామస్థుల్లో చైతన్యం తీసుకువచ్చారు.శిబిరంలో మొత్తం 44 పశువులకు చూడు పరీక్షలు నిర్వహించగా,8 పశువులకు చూడు కట్టడం జరిగిందన్నారు.12 పశువులకు కృత్రిమ గర్భధారణ చేపట్టారు.అదేవిధంగా 18 దూడలకు నట్టల మందు తాగించారు.ఈ కార్యక్రమంలో చినూర్ సర్పంచ్ మురళీమోహన్ గౌడ్,ఉప సర్పంచ్ సుకన్య,మండల పశువైద్యాధికారి రవికుమార్,కార్యదర్శి సరేందర్,వార్డు సభ్యులు సాతెవ్వ,హన్మండ్లు,రాజు,బి. రాజు,పశువైద్య సిబ్బంది విజయ,ఘౌస్,జయరాజ్, గంగారాం,శ్రీహరి,డెయిరీ రైతులు,గ్రామస్థులు  పాల్గొన్నారు.