23 May, 2026 | 6:46 PM

Breaking News

కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •   పేరు మార్పిడి చేసిన రెవెన్యూ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి   •   జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ గా దూమల రాజ్ కుమార్   •   తాడువాయిలో జీలుగ విత్తనాల పంపిణీ   •   రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా గడ్డం రాజశేఖర్ నియామకం   •   నందివాడలో ఉపాధి పనుల పరిశీలన   •  

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

26-03-2026 01:51 PM

అఖిల భారత రైతుకూలి సంఘం డిమాండ్.

అన్నపురెడ్డిపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలోని కొండయ్య గూడెం గ్రామంలో అఖిల భారత రైతుకులి సంఘం గ్రామ సభ జరిగినది. ఈ సభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని అనంతరం జరిగిన కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు ఎస్ కే ఉమర్ మాట్లాడుతూ రైతాంగ సమస్యల కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాల కోసం భూమికోసం ఈ దేశ విముక్తి కోసం జరుగుతున్న అనేక రకాల ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా రైతుకూలి సంఘం నిరంతరం రైతుల పక్షాన వ్యవసాయ రంగం సమస్యలపై పోరాటాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మూడు ప్రజావ్యతిరేక రైతు వ్యతిరేక చట్టాలను ఒకటి విద్యుత్ చట్టం, విత్తన చట్టం, ఉపాధి హామీ చట్టాలను తీసుకొచ్చి ప్రజలకు వ్యతిరేకమైన కార్యక్రమాలు చేపట్టిందని విద్యుత్ చట్టం వల్ల స్పాట్ మీటర్లు పెట్టి సెల్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసి రైతు కూలీలను ఇబ్బందులు పాలు చేసే విధంగా ఉన్నాయని. విత్తన చట్టాలు రైతులకు వ్యతిరేకమని అవి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చేస్తున్న చట్టాలని ఉపాధి హామీ చట్టం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని ఎప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని దాన్ని వ్యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. నూతన గ్రామ కమిటీ అధ్యక్షులుగా అహ్మద్ కార్యదర్శిగా సాయిబాబాను కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.