26 March, 2026 | 3:28 PM

Breaking News

పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిరంతరం సరఫరా.. కొరత లేదన్న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌   •   మార్కాపురం బస్సు ప్రమాదంలో జగిత్యాలకు చెందిన ఇద్దరు మృతి   •   మ‌ర్యాద ఇవ్వ‌డం లేదని అత్తమామలపై కక్ష.. ఏడేళ్ల చిన్నారిని చంపిన బావ   •   గొల్లపల్లి కొలనూరులో ద్వారక యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక   •   గ్యాస్ కోసం రోడ్డెక్కిన క్యూ లైన్   •   ఆడపిల్లకు అన్యాయం... అడిగితే అక్రమ కేసులా..?   •   తాసిల్దార్ కార్యాలయం ముందు పడిగాపులు   •   పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సభ్యత్వాల నమోదు ప్రారంభం   •   సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం   •   ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి, పోలీస్ ఎస్‌హెచ్‌వోను నియమించాలి   •  

అంజన్న హుండీ లెక్కింపు ప్రారంభం

26-03-2026 01:48 PM

ఊర్కొండ: మండల పరిధిలోని ఊర్కొండపేట శ్రీ పబ్బాతి ఆంజనేయస్వామి(Sri Anjaneya Swamy Devalayam) దేవాలయ హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం దేవాదాయ ధర్మాదాయ శాఖ  ఇన్స్పెక్టర్ విణదరి, ఆలయ ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలకు మునుపు జనవరి 2 న హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది.

బ్రహ్మోత్సవాలు అనంతరం తిరిగి గురువారం 82 రోజుల  తర్వాత హుండీ లెక్కింపు ప్రారంభించామని ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వహీదోద్దీన్, రవీందర్ గౌడ్, మాజీ పాలకమండలి సభ్యులు బొందయ్యా గౌడ్, ఆంజనేయులు, మల్లేష్ యాదవ్, అర్చకులు శ్రీనువాస్, ప్రవీణ్, మహేష్, సిబ్బంది మారుతి రావు ,వరలక్ష్మి, సేవ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.