నటుడు బ్రహ్మాజి తనయుడు సంజయ్రావ్ హీరోగా, ఆయేషాఖాన్ హీరోయిన్గా రూపొందుతున్న చిత్రం ‘గుట్టు చప్పుడు’. మణీంద్రన్ దర్శకత్వంలో డా.లివింగ్స్టన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ను నటుడు సాయిదుర్గ తేజ్ అన్లైన్లో విడుదల చేయగా, నటుడు బ్రహ్మాజి ఆఫ్ లైన్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మాజి మాట్లాడుతూ “టైటిల్ తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని గుట్టు చప్పుడు కాకుండా షూటింగ్ చేస్తున్నారు. మా అబ్బాయి నటిస్తున్న 3వ సినిమా ఇది. కంటెంట్ను నమ్మి భారీగా ఖర్చు పెట్టి తీసిన సినిమా ఇది. టీజర్ చూసిన తరువాత చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగింది” అన్నారు. హీరో సంజయ్రావు మాట్లాడుతూ “ఈ సినిమా కోసం ప్రతి టెక్నిషియన్, ఆర్టిస్ట్లు వారి బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. నా కెరీర్కు ఇది టర్నింగ్ పాయింట్ లాంటి సినిమా. సినిమా టీమ్ అందరికి ఈ చిత్రం మంచి గుర్తింపును తెస్తుంది. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఇందులో వున్నాయి” అన్నారు. సంగీత దర్శకుడు గౌర హరి మాట్లాడుతూ “నా కెరీర్ ఈ సినిమా ఓ మంచి అవకాశం. దర్శకుడు నన్ను చాలా నమ్మారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయలేదని భావిస్తున్నాను. సినిమాలో మంచి కంటెంట్ వుంది. సంగీతానికి మంచి స్కోప్ వుండేలా దర్శకుడు కథను రాసుకోవడం నాకు ప్లస్ అయ్యింది” అన్నారు.