25-06-2025 01:28:32 AM
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మొత్తం 87 అధ్యాపకుల పోస్టులకుగానూ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఐఐటీ నీట్, సీఎంఏెేక్లాట్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు అర్హత, అనుభవమున్న నిష్ణాతులైన వారు దరఖాస్తు చేసుకోవాలని గురుకుల సెక్రటరీ అలగు వర్షిణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పదకొండు గురుకులాల్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సీఎంఏ, క్లాట్ సబ్జెక్టుల్లో ఖాళీలున్నాయని తెలిపారు. తగిన అర్హతలున్న వారు రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూలకు సంబంధిత ధ్రువపత్రాలతో ఈనెల 27న ఉదయం 9 గంటలకు గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ అభ్యర్థులు హైదరాబాద్ గౌలిదొడ్డి గురుకులం, 28న బాటనీ, జువాలజీ, సీఎంఏ, క్లాట్ అభ్యర్థులు నార్సింగి గురుకుల విద్యాలయం వద్ద హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు హెల్ప్లైన్ నెం:040 సంప్రదించాలని కోరారు.