25-06-2025 01:30:22 AM
-నాలుగు సంస్థల్లో 16మంది డైరెక్టర్ల భర్తీ
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ల భర్తీని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ట్రా న్స్కో, జెన్కో, రెండు డిస్కంలు అయిన ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లలో ఖాళీగా ఉన్న డైరెక్టర్ల స్థానాలను భర్తీచేస్తూ ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు సంస్థల్లోనూ మొత్తం 16 మందిని డైరెక్టర్లుగా నియమిస్తూ వేర్వేరు ఉత్తర్వులు జారీచేశారు. నియమించిన డైరెక్టర్ల జాబితా ఇలా ఉంది.
తెలంగాణ జెన్కోలో..
పి.బాలరాజు (హైడల్), వై.రాజశేఖరరెడ్డి (థర్మల్ అండ్ ప్రాజెక్ట్స్), ఎస్వీ కుమార్రాజు(హెచ్ఆర్ అండ్ ఐఆర్), బీ నగ్యా ఐఆర్టీఎస్ (కోల్ అండ్ లాజిస్టిక్స్), జీ వీరమహేందర్ (ఫైనాన్స్ అండ్ కమర్షియల్).
తెలంగాణ ట్రాన్స్కోలో..
గాదె సంపత్కుమార్(గ్రిడ్ అండ్ ట్రాన్స్మిషన్ మేనేజ్మెంట్), డీ లతావినోద్ (ప్రాజెక్ట్స్),ఒరుగంటి శ్రీనివా సులు (ఫైనాన్స్). దక్షిణప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్)లో.. వీ.శివాజీ (ప్రాజెక్ట్స్), ఎన్. నర్సింహులు (ఆపరేషన్స్), చిలుకమారి చక్రపాణి (కమర్షియల్), పీ కృష్ణారెడ్డి (ఫైనాన్స్). ఉత్తరప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్)లో.. వంటేరు తిరుపతిరెడ్డి (ఫైనా న్స్), టీ మధుసూదన్ (ఆపరేష న్స్), వంగూరు మోహన్రావు (ప్రాజెక్ట్స్), సీ ప్రభాకర్ (హెచ్ఆర్డీ అండ్ ఐఆర్).
సీఎం, డిప్యూటీ సీఎంలకు కృతజ్ఞతలు
రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ సంస్థల్లో ఒకేసారి అన్ని డైరెక్టర్ పదవులను భర్తీ చేయడం ద్వారా విద్యుత్ సంస్థల అభివృద్ధికి బాటలుపరుస్తున్న సీఎం రేవంత్రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ అంజయ్య కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా నిరంతరం వినియోగదారులకు, ముఖ్యంగా రైతులకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని ఉద్యోగులకు ఆయన పిలుపునిచ్చారు.