calender_icon.png 25 June, 2025 | 9:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీల్లో.. పాలనలో ఏదీ ప్రాతినిధ్యం!

25-06-2025 01:27:38 AM

సమ్మిళిత సంస్కృతుల ఇంద్రధనస్సు

గంగా జమునా తహజీబ్

తెలంగాణ మినీ ఇండియా

ఉత్తరాది వారికి ఒడి

  1. కుతుబ్ షాహీ, నిజాం కాలంలోనే హైదరాబాద్‌కు.. 
  2. రోజురోజుకూ పెరుగుతున్న ఉత్తరాది వారి జనాభా
  3. గెలుపోటముల్లో కీలకమవుతున్న వారి ఓట్లు

* దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కులాలు, మతాలు, వర్గాలకు తెలంగాణ నెలవు. అందుకే తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి మినీ వర్షన్ అని చరిత్రకారులు అభివర్ణిస్తారు. దేశ నలుమూలల నుంచి ప్రజలు తెలంగాణలో శతాబ్దాల క్రితం నుంచి స్థిరపడుతూ వస్తున్నారు.

వనరులు, వాతావరణం కారణంగా దేశంలోని చాలా రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ తమ సొంత ప్రాంతంగా మారింది. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ప్రజలు కొంతమేర స్థిర పడినప్పటికీ, సింహభాగం మాత్రం ఉత్తరాది రాష్ట్రాల వారే ఉన్నారు. ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల ప్రాతినిధ్యం ఎక్కువ. 

తెలంగాణలో వ్యాపార అనుకూల వాతావరణం, శాంతి భద్రతలు, ఇక్కడి ప్రజల అక్కున చేర్చుకునే తత్వం ఇతర రాష్ట్రాల ప్రజలను ఆకర్షించాయి. ఇలాంటి అంశాల కారణంగా భిన్నత్వంలో ఏకత్వానికి రాష్ట్రం నిదర్శనమవుతున్నది. గంగా జమునా తెహజీబ్ నినాదానికి నిజమైన ప్రతీకగా నిలుస్తున్నది.

ప్రస్తుతం ఇతర రాష్ట్రాల ప్రజల ప్రాబల్యం రోజురోజుకూ పెరుగుతున్నది. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో వారి ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో, పరిపాలనలో భాగస్వాములు కావాలని వారు ఆకాంక్షిస్తున్నారు. 

హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): తెలంగాణలో సమశీతోష్ణ పరిస్థితులు అన్ని వ్యాపారాలకు అనుకూలంగా ఉంటాయి. దీంతోపాటు అన్ని వనరులు అందుబాటులో ఉండటంతో శతాబ్దాల క్రితం నుంచి ఈ ప్రాంతం వ్యాపార కేంద్రంగా నిలుస్తున్నది. గుజరాతీలు, రాజస్థానీలు వందల ఏళ్ల క్రితమే రాష్ట్రానికి వలసరావడమే దీనికి నిదర్శనం. తెలంగాణలో వ్యాపార విస్తరణకు గణనీయంగా అవకాశా లుండటంతో ఇతర రాష్ట్రాల ప్రజలను ఎక్కువగా ఆకర్షించింది.

ఇక్కడ ఏ సమస్య లేకపోవడంతో తెలంగాణ, హైదరాబాద్ వైపు వారు ఎక్కువగా దృష్టి సారించారు. ముఖ్యంగా ఇక్కడి ప్రజల్లోని కలుపుగోలుతనం, ఆప్యాయత ఎంతో నచ్చాయి. ఆర్థిక సలహాదారులుగా పనిచేసేందుకు వలస వచ్చినవారు ప్రస్తుతం విజయవంతంగా వ్యాపారాలను నిర్వహించడానికి ఇక్కడి అనుకూల వాతావరణమే కారణమని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు కీలకంగా వ్యవహరిస్తున్నారు. 

హైదరాబాద్ ఎన్నికల్లో కీలక పాత్ర..

హైదరాబాద్ ప్రాంతంలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు ఆరు నుంచి ఏడు లక్షలకు పైగా మంది స్థిరపడినట్లు అంచనా ఉంది. హైదరాబాద్ పరిధిలోని ఎన్నికల్లో వీరంతా కీలక పాత్ర పోషిస్తున్నారు. గుజరాతీ గల్లీ, సింధీ కాలనీ, పంజా బీ బాగ్, పార్షిగుట్ట వంటి ప్రాంతాలలో రాజస్థాన్, పంజా బ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ముంబై, బెంగాల్ మొదలైన ప్రాంతాలకు చెందిన ప్రజ లు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు.

కొన్ని నియో జకవర్గాల్లో వారి మెజారిటీ ఎక్కువగా ఉం డ టంతో, ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ అభ్యర్థులకు ఓటు వేసేలా ఓటర్లను ఆకర్షించడానికి ఆయా రాజకీయ పార్టీల నాయకులు తమ ప్ర యత్నాలు చేస్తాయి. గ్రేటర్ హైదరాబాద్ ప్రాం తంలోనే 7 లక్షలకు పైగా ఉత్తరాది ఓట ర్లు ఉన్నారని పలు గణాంకాలు చెబుతున్నా యి. వీరిలో ఎక్కువ మంది నగరంలోని కాచిగూడ, కోఠి, సికింద్రాబాద్, అమీర్‌పేట, బేగంపేట, అబిడ్స్, బేగంబజార్ ప్రాంతాలలో ఉన్నారు.

సనత్‌నగర్ నియోజకవర్గంలోనే 35,000 మంది ఉత్తర భారతీయ ఓటర్లు ఉన్నట్టు అంచనా. ఎన్నికలు జరిగినప్పుడు ఈ నియోజకవర్గంలో ఓటింగ్ 50 నుండి 60 శాతం మధ్య ఉంటుంది. సాధారణంగా గెలుపు ఓట్లు 25 శాతంగా ఉంటాయి. అంటే 30,000 ఓట్లు. ఇది ఎన్నికల్లో ఉత్తర భారత ఓటర్ల ప్రాముఖ్యతను సూచిస్తుంది. దీనిని పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులు ఇక్కడి ఉత్తర భారత ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. 

గోషామహల్‌లో లక్ష మంది...

గోషామహల్ నియోజకవర్గంలో 2.7 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. వారిలో లక్ష మందికి పైగా ఉత్తర భారతీయులు. ఈ స్థానంలో అభ్యర్థుల గెలుపు ఆధిక్యం సాధారణంగా 13 శాతం లేదా 18 వేల ఓట్లు ఉంటుంది. ఇది ఓటర్ల ప్రాముఖ్య తను పెంచుతుంది. కాచిగూడ, నల్లకుం ట, అంబర్‌పేట్, బాగ్ అంబర్‌పేట్ నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాలలో 25,000 కంటే ఎక్కువ ఉత్తర భారతీయ ఓటర్లు ఉన్నారు.

శేరిలింగంపల్లిలో ఓటర్ల సంఖ్య 7 లక్షలకు చేరుకుంది. ఎన్నికల్లో పోలింగ్ 45 నుండి 50 శాతం మధ్య నమోదవుతుంది. 2018 ఎన్నికల్లో, గెలిచిన అభ్యర్థి ఇక్కడ 16 శాతం (44,295) ఓట్లతో గెలిచారు. ఫలితంగా 40,000 మంది ఉత్తర భారత ఓటర్లు ఇక్కడ కీలకంగా మారారు. అధికారిక లెక్కల ప్రకారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 6.7 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, సాధారణంగా ఓటర్ల సంఖ్య 55 శాతం వరకు ఉంటుంది.

గత ఎన్నికల్లో విజయానికి 14 శాతం ఓట్లు కీలకం కావడంతో అభ్యర్థులు ఇక్కడి 25,000 మం ది ఉత్తరాది ఓటర్లను ఆకర్షించడానికి ప్రయ త్నిస్తున్నారని వర్గాలు తెలిపాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 3న ఓటింగ్ నిర్వహించి డిసెంబర్ 5న లెక్కింపు జరుగు తుంది. దీంతోపాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఇతర రాష్ట్రాల ప్రాబల్యం ఉన్న బేగంబజార్ లో రమేష్‌కుమార్, రాంగోపాల్‌పేటలో ప్రియాంక వర్మ కార్పొరేటర్లుగా గెలిచిన దాఖలాలున్నాయి. 

చారిత్రక నేపథ్యం..

1591లో ముహమ్మద్ కులీ కుతుబ్ షా గోల్కొండ నగరాన్ని స్థాపించారు. నగరంలో ముత్యాలు, వజ్రాలు, వస్త్రాల వాణిజ్యం వృద్ధి చెందడం వల్ల వివిధ ప్రాంతాల నుంచి వలసదారులు ఆకర్షితులయ్యారు. తమిళులు, మహారాష్ర్టులు, మలయాళీలు, గుజరాతీలు, రాజస్థానీలు, పంజాబీలు వంటి రాష్ట్రాల ప్రజలు శతాబ్దాలుగా హైదరాబాద్‌లో స్థిరప డ్డారు. హైదరాబాద్‌లో సాంస్కృతిక, వాణిజ్య కేంద్రంగా వృద్ధి చెందడంలో వీరి పాత్ర కీల కంగా ఉంది.

తమిళులు ముఖ్యంగా సికిం ద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నారు. తమిళ నివాసితులు సమ కాలీన జీవనశైలిని లోతైన సాంస్కృతిక పద్ధతు లతో సమతుల్యం చేసుకోవడంలో ప్రసిద్ధి చెందారు. వారి ఆలయ సందర్శనలు, సాంప్ర దాయ దుస్తులలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. మలయాళీలు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ విద్యలో తమ నైపుణ్యాన్ని తీసుకువచ్చారు.

పంజాబీలు వాణిజ్యం, చిన్న తరహా పరి శ్రమల ఏర్పాటు, అభివృద్ధికి దోహద పడ్డారు. పార్సీలు నిజాం పాలనలో రుణాలు ఇవ్వ డంతోపాటు పరిపాలనలో, ఉన్నత పదవు లలో పనిచేశారు. ఈ రకంగా దేశంలోని ఆ యా రాష్ట్రాలకు సంబంధించిన సంప్ర దా యాలు హైదరాబాద్ సాంస్కృతిక వస్త్ర ధారణను సుసంపన్నం చేశాయి.

వారి పం డుగలు, వంటకాలు, భాషలు మాతృభాష తెలుగు, ఉర్దూ సంప్రదాయాలతో పాటు కలి సి పోయాయి. పరిపాలనా చతురతకు పే రు గాంచిన కాయస్థులు ప్రధానమంత్రి పదవి తో సహా ఉన్నత పదవులను అధిరోహిం చా రు. పాలన, రికార్డుల నిర్వహణ, దౌత్యంలో వారి నైపుణ్యం నిజాం ప్రభుత్వం సమర్థవం తంగా పనిచేయడంలో కీలక పాత్ర పోషించింది. 

‘ఐటీ’లో మేటి..

1990 తర్వాత తక్కువ కాలంలోనే హైదరాబాద్ ప్రపంచ ఐటీ హబ్‌గా రూపాం తరం చెందింది. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఆర్థిక సంస్కరణలు, చురుకైన విధానాలు బహుళజాతి సంస్థలను ఆకర్షించాయి. అను కూలమైన వ్యాపార వాతావరణాన్ని సృష్టిం చాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వం లోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీ, ఫార్మా రంగాలను ముందుకు తీసుకెళ్లి ప్రపంచ వ్యా ప్తంగా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేలా చేసింది.

ఐటీ పార్కులు, ప్రత్యేక సెజ్‌లు, టీబౌహబ్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ వంటి కార్యక్రమాలు ఐటీ అభివృద్ధిలో కీలకం గా వ్యవహరిస్తున్నాయి. ఈ ఐటీ బూమ్ భారత దేశం అం తటా యువ నిపు ణుల ను ఆకర్షి స్తున్న ది. వీరిలో తమి ళులు, మ హా రాష్ర్టులు, మ ల యాళీలు, గు జ రాతీలు, రాజ స్థానీలు, బిహారీ లు, పం జాబీలు ఉ న్నారు. హైద రాబాద్ విశ్వవి ద్యాల యాలు, ఇంజనీరింగ్ కళా శాలలు నైపు ణ్యం కలిగిన మా నవ వనరులను అంది స్తున్నాయి.

ప్రపంచ స్థాయి వ నరులు, శాం తి భద్ర తలు, లి వింగ్ కాస్ట్ వంటి అం శాలతో హైదరా బాద్ ఆకర్ష ణీయమైన గమ్యస్థానం గా నిలు స్తుంది. ఐటీ పరి శ్రమ హైద రాబాద్ ఆర్థికవ్య వస్థను గణ నీయంగా ప్రభా వితం చేస్తున్నది. 95 బిలి యన్ల డాల ర్ల ఉత్పత్తి తో భారత దేశంలో ఆరవ అతిపెద్ద పట్టణ ఆర్థిక వ్యవస్థగా నిలిచేందుకు దోహదపడింది. 

ఓట్లే కాదు... సీట్లు కావాలి

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో గుజరాత్, రాజస్థాన్, బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, కేరళ, ఇతర రాష్ట్రాల ప్రజల జనాభా పెరుగు తుండటంతో వారు రాజకీయంగా బలపడ టంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. వారి ప్రాబల్యం, ఓట్లు ఎక్కువగా ఉన్న నియో జకవర్గాల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిం చాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఎన్నికల్లో గెలుపు, ఓటములను నిర్ణయించే స్థాయిలో ఇతర రాష్ట్రాల ప్రజల ఓట్లు నేపథ్యంలో రాజ కీయ పార్టీలు కూడా వారి డిమాండ్లను పరి శీలించాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఈ నేప థ్యంలో వీలైతే పోటీ చేసేందుకు అవ కాశం కల్పించాలని, లేని పక్షంలో పార్టీ పర మైన పదవులైన కేటా యించాలని ఆయా వర్గాల వారు అన్ని పా ర్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా రు.

రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ ఎస్, ఇత ర పార్టీల్లోనూ కార్యవ ర్గం లోని పదవులైన కేటాయించే అంశంపై ఆలోచన చేయాలని సూచి స్తున్నారు. రాజకీ యంగా తమ ప్రాతిని ధ్యం పెంచుకునే దిశగా ఆయా వర్గాల ప్రజలు అడుగులు వేస్తున్నారు. తద్వారా వారి సమస్య లను, డిమాండ్ల నెరవే ర్చుకోవాలనే ప్రయ త్నం చేస్తున్నారు. ఇం దులో భాగంగా పరిపా లనలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నారు. 

గెలుపోటముల్లో కీలకంగా..

రాష్ట్రవ్యాప్తంగా గుజరాతీలు, రాజస్థానీలు, మహారాష్ట్రీయులు, బెంగాలీలు, పంజాబీలు, ఇతర రాష్ట్రాల వారు స్థిర పడినప్పటికీ హైద రాబాద్‌తో పోలిస్తే ఇతర జిల్లాల్లో రాజకీయ ప్రభావం కాస్త తక్కువగానే ఉంటుంది. కానీ హైదరాబాద్‌లో మాత్రం వారి జనాభా గణనీయంగా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే గెలుపోటములను నిర్ణయించే స్థాయి లో వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి ప్రభావానికి అనుగుణంగా వారి ఆకాం క్షలున్నాయి.

తెలంగాణలోని ఇతర వర్గాల తోపాటుగా తమకు కూడా సమాన ప్రాతిని ధ్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఓట్ల పరంగానే కాకుండా పోటీ చేయడంలోనూ తమకు సరైన ప్రాతినిధ్యం కోసం కోరుతు న్నారు. శాసనసభలో తమ గళాన్ని వినిపిం చేందుకు వీలుగా రాజకీయ పార్టీలు ఆయా వర్గాల వారికి పోటి చేసే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

వ్యాపార రంగంలో ప్రసిద్ధి చెందిన గుజరాతీలు, రాజస్థానీలు ప్రసుత్తం మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి ప్రభుత్వ ప్రాధాన్యతలపై దృష్టి సారించారు. తెలంగాణ పురోగతిలో భాగమైన రోడ్ల సౌకర్యం, ఆరోగ్య సంరక్షణ వంటి తక్షణ అవసరాలను పూర్తిచేయాలని కోరుతున్నారు. మహిళలు లింగ సమానత్వాన్ని, మహిళా సాధికారతను కోరుకుంటున్నారు. శిక్షణా కార్యక్రమాల ద్వారా మహిళల పురోగతిని సులభతరం చేయాలని, తద్వారా వారి నైపుణ్యాలు, ఉపాధిని మెరుగుపర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 

కుతుబ్‌షాహీ కాలంలో గుజరాతీలు..

హైదరాబాద్ పాలకుల్లో ముఖ్యులైన కుతు బ్‌షాహీలు 1518 నుంచి 1687 వరకు పాలించారు. కుతుబ్‌షాహీల కాలం నుంచే హైదరాబాద్ విభిన్న సంస్కృతీ సంప్రదా యాల సమ్మేళనంగా నిలుస్తుంది. అయితే కుతుబ్‌షాహీల కాలంలోనే గుజరాతీయలు వ్యాపార నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చారు. దాదాపు నాలుగు శతాబ్దాల క్రితం నుంచే గుజరాతీలు హైదరాబాద్‌లో అంతర్భాగంగా కొనసాగుతున్నారు.

హైదరాబాద్‌కు నడిబొ డ్డున్న ఉన్న కోటి ప్రాంతంలో మొదట్లో గుజ రాతీలు నివాసం ఏర్పరచుకున్నారు. క్రమంగా ఆ ప్రాంతంలో వారి సంఖ్య పెరగడంతో ఆ ప్రాంతానికి గుజరాత్ గల్లీ అని పేరు వచ్చింది. ముఖ్యంగా కోటీ, రాంకోటి, కాచిగూడ ప్రాంతాల్లో వీరు ఎక్కువగా నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం కేవలం హైదరాబాద్ ప్రాంతంలోనే 3.5 లక్షలకు పైగా గుజరాతీల జనాభా ఉందని అంచనా ఉంది.

ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌పై గుజరాతీలు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. గుజరాతీలు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దాండియా, గర్భా వంటి పోటీలతో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. 

300 ఏళ్ల క్రితమే మహారాష్ట్రీయులు..

మహారాష్ట్రకు చెందిన ప్రజలు 300 ఏళ్ల కిందే తెలంగా ణకు, ముఖ్యంగా హైదరాబాద్‌కు రావడం ప్రారం భించారు. క్రమ ంగా ఇక్కడే స్థిర నివాసం ఏ ర్పా టు చేసుకు న్నా రు. మహారాష్ట్రీ యులు ముఖ్యంగా వారి సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించేందుకు  కమ్యూనిటీల ను, సాంస్కృతిక సంస్థలను ఏర్పర్చుకున్నారు. వీటి ద్వారా వారి  సామాజిక కార్యక్రమాలను కొనసా గిస్తు న్నారు.

నగరంలోని శాలిబండ, గౌలిగూడ, సుల్తాన్‌బజార్, కాచిగూడ, బర్కత్‌పుర, నల్లకుంట ప్రాంతాల్లో ఎక్కువ స్థిరపడ్డారు. గణేష్ చతుర్థి, నవరాత్రి, తిలక్ జయంతి వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. 1991 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్‌లో 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు, రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల వరకు వీరి జనాభా ఉండేది. 

నిజాం కాలంలో రాజస్థానీలు

అసఫ్‌జాహీ వంశానికి చెందిన నిజాం హైదరాబాద్‌ను 1724 నుంచి 1948 వరకు పాలించారు. ఆ సమ యంలో హైదరాబాద్‌కు రాజస్థానీల వలస ప్రారంభమైంది. అయితే రాజ స్థాన్‌లో కరువు రావడంతో నిజాం ఆదే శాల మేరకు హైదరాబాద్ వచ్చిన మా ర్వాడీలు ఇక్కడ వ్యాపార కలాపాలు, ఆర్థిక వ్యవహారాలు చూసుకునేవారు. ఆ తర్వాత కాలంలో అప్పటికే ఇక్కడ స్థిరపడిన వారి సహా యంతో రాజ స్థానీల వలసలు భారీగా పెరిగాయి. దాదాపు 250 ఏళ్లకు పూర్వం నుంచి వారు హైదరాబాద్‌కు వచ్చి స్థిరప డ్డారు.

అయితే రాజస్థానీలు ముఖ్యంగా బేగంబజార్, ఝాన్సీ బజార్, కబుతర్ ఖానా, షంషీర్‌గంజ్, చార్ కమాన్ ప్రాంతాల్లో అధికంగా ఉంటున్నారు. హైదరా బాద్‌లో రాజస్థానీలు కూడా ఇంచుమించుగా 3 లక్షల కుపైనే ఉన్న ట్టు ఆ కమ్యూనిటీ చెందినవారు చెబు తున్నారు. వలస వచ్చిన రాజస్థానీలు క్రమంగా ఇక్కడి సామాజిక పరిస్థితుల్లో కూడా ఇమిడిపోయారు. ప్రస్తుతం ఇక్క డ స్థిరప డిన వారంతా హైదరాబాద్‌నే వారి సొంత ప్రాంతంగా భావిస్తున్నారు. 

గుర్తింపుతో విస్తృత ప్రయోజనాలు..

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన క మ్యూనిటీలను అధికారికంగా గుర్తిం చడం వల్ల చాలా విస్తృతమైన ప్రభా వా లు ఉంటాయి. హైదరాబాద్ నగర కీర్తి పెరిగేందుకు ఎంతో దోహదం చేస్తుంది. ఎక్కువ మంది ప్రతిభను, పెట్టుబడు లను ఆకర్షిస్తుంది. విభిన్న జనాభా కలిగిన ఇతర భారతీయ రాష్ట్రాలకు ఒక మోడల్‌గా నిలిచేందుకు అవకాశం ఉంటుంది. జాతీయ ఐక్యతను ప్రోత్స హిస్తుంది. నిజాం పాలన మొదలుకొ ని.. ప్రస్తుతం ప్రపంచ ఐటీ కేంద్రంగా హైదరాబాద్ ఎదగడం విభిన్న వర్గాల సహకారాలకు నిదర్శనం.

తమిళులు, మహారాష్ర్టులు, మలయాళీలు, గుజరా తీలు, రాజస్థానీలు, పంజాబీలు, దీనిలో కీలకంగా వ్యవహరించారు. యువ ఐటీ నిపుణులు దానిని కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తమ ప్రతినిధుల కు పాలనలో భాగస్వాములను చేయ డం ద్వారా తమకు గౌరవం లభిస్తుం దని ఆయా వర్గాల వారు అభిప్రాయ పడుతున్నారు. నగరం అభివృద్ధి చెందుతున్నప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కీర్తిని నిలబెట్టుకోవడానికి ఇలాంటి చర్యలు ఎంతో కీలకంగా వ్యవహరిస్తాయని చెబుతున్నారు. 

బెంగాలీలు పాత వారే..

హైదరాబాద్ నగరానికి బెంగాలీ కమ్యూనిటీ కొత్త కాదు. వారు నిజాం కాలం నుంచే చాలా మంది బెంగాలీలు ఉన్నత పదవుల్లో సేవలు అందించారు. నిరంజన్ షా వైఎంసీఏ కార్యదర్శి గా, సచికాంత్ ముఖర్జీ నిజాం వద్ద జియోలజిస్ట్‌గా, కిషోరి మోహన్ అకౌంటెంట్‌గా, అమృత్ సిల్ నిజాం కాలేజీ ప్రొఫెసర్‌గా, బీ.కే దాస్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు.

ఈ క్రమంలో బెంగాలీలు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ప్రస్తుతం హైదరా బాద్ నగరంలో 4 లక్షలకుపైనే బెంగా లీల జనాభా ఉంది. వీరు ముఖ్యంగా అమీ ర్‌పేట, బేగంపేట, హిమాయత్‌నగర్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో నివాసముంటు న్నారు. బెంగాలీల్లో ఎక్కువ మంది బ్యాంకుల్లో, కొంత మంది ఐఏఎస్ ఆఫీసర్లుగా పనిచేశారు. కొంత మంది బంగారు వ్యాపారులుగా కూడా పనిచేశారు. 

జిల్లాల్లోనూ పెరుగుతున్నారు..

ఇతర రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా ఉత్త రాది ప్రజలు కుతుబ్‌షాహీలు, నిజాం కాలం లో హైదరాబాద్‌కు వచ్చినప్పటికీ క్రమంగా పెరుగుతున్నారు. ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారి సహాయంతో తెలం గాణలోని ఇతర జిల్లాలకు కూడా విస్తరిం చారు. హైదరాబాద్ పరిధిలో ఉన్న స్థాయిలో కాకపోయిన జిల్లాల్లో వారి జనాభా పెరు గుతుంది.

ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఆయా రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా తమ వ్యాపారాలు ఏర్పా టు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో స్థిర నివాసం కూడా ఏర్ప రచుకుంటున్నారు. పెరుగుతున్న జనాభా తగ్గట్టు వారి ఆయా అంశాలతోపాటు రాజకీ యాల్లోనూ వారి ప్రాతినిధ్యం పెంచుకోవడంపై దృష్టి సారి స్తున్నారు.

అయితే ఇప్పటికే కొంత మంది నాయకులు రాజకీయంగా నిలదొ క్కుకున్నా రు. రామగుండంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, కరీంనగర్‌లో రవీందర్ సింగ్, జహీరాబాద్‌లో బీబీ పాటిల్, హైదరా బాద్‌లో రాజాసింగ్ వంటి వారు వెలుగులోకి వచ్చారు. అయితే వీరంతా తెలంగాణలో పుట్టి పెరిగిన వారే అయి నప్పటికీ వారు పూర్వీకులు మాత్రం వలస వచ్చినవారే కావడం గమనార్హం.