27-05-2025 12:17:39 AM
నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్
కరీంనగర్ క్రైం, మే 26 (విజయ క్రాంతి): రాజీవ్ యువ వికాస దరఖాస్తుల సిబిల్ స్కోర్ వెరిఫికేషన్ పూర్తి చేసిన బ్యాంకులు సంబంధించిన దరఖాస్తులను నగరపాలక సంస్థ కు తిరిగి అప్పగించాలని నగరపాలక సంస్థ కమీషనర్ బ్యాంకర్లను ఆదేశించారు.
సోమవారం కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నగరంలో ఉన్న వివిధ బ్యాంకు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ బ్యాంకు బ్రాంకు బ్రాంచ్ ల వారిగా అందించిన అప్లికేషన్ల సిబిల్ స్కోర్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని అన్నారు.
సిబిల్ స్కోర్ వెరిఫికేషన్ పూర్తి చేసిన బ్యాంకులు తిరిగి నగరపాలక సంస్థ కు అప్లికేన్లతో పాటు దరఖాస్తు దారుల సిబిల్ స్కోర్ వివరాలను అందించాలని కోరారు. లబ్దిదారులను ఎంపిక చేసే అధికారం బ్యాంకు అధికారులకు లేదని తేల్చి చెప్పారు.
బ్యాంకు అధికారులు ఎవరు కూడ దరఖాస్తు దారులకు లోన్స్ యూనిట్స్ కేటాయిస్తామని చెప్పడం హా మీలు ఇవ్వడం లాంటివి చేయకూడదని ఆదేశించారు. డిప్యూటీ కమీషనర్ ఖాదర్ మొహియుద్దీన్, లీజ్ డిస్ట్రిక్ మేనేజర్ ఆంజనేయులు, మేప్మా పిడి వేణుమాధవ్ రెడ్డి, టీఎంసి మానస, సివోలు, బ్యాంకు అధికారులుపాల్గొన్నారు.