07-12-2025 01:13:30 AM
హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): బీఎన్ఎస్ సంహిత 2023లోని సెక్షన్-20 ప్రకారం డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ విభాగం (33) జిల్లాలను ఏర్పాటు చేసి - నోటిఫై చేసింది. వరంగల్ (అర్బన్), హన్మకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగులలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సి. రాము, పబ్లిక్ ప్రాసిక్యూటర్, పోల్ సెషన్స్ కోర్ట్, హన్మకొండ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా నియమితులయ్యారు.
ఎం సంతోషి- అదనపు పిపి జిఆర్ I స్పెషల్ కోర్ట్ ఫర్ ఎస్సీ, ఎస్టీ చట్టం కమ్-II అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్, వరంగల్లో ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా వరంగల్ యూనిట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మురళీధర్రావు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వనజ, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పవని, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రుక్మాబాయి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రచిత, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వరి, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాధవి, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి. గణేష్ ఆనంద్ (మహబూబాబాద్), అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ శ్రీనివాస్ (భూపాలపల్లి) వారిని అభినందించారు.