14 April, 2026 | 1:59 PM

‘ఆరావళి’లో 90% రక్షిత ప్రాంతమే

23-12-2025 02:09 AM

కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: కేవలం ఖనిజాల తవ్వకం కోసమే ఆరావళి పర్వతాల నిర్వచనాన్ని తాము మార్చినట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, ఆ పర్వత శ్రేణుల్లో 90% విస్తీర్ణం రక్షిత ప్రాంతమేనని కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది. సమ గ్ర నిర్వహణ ప్రణాళిక ఖరారయ్యేవరకు ఆ ప్రాంతంలో కొత్త గనుల తవ్వకానికి లీజులు ఇవ్వొద్దని సుప్రీంకోర్టు నిషేధం విధించిన విషయాన్ని గుర్తుచేసింది. కోర్టు ఆమోదించిన నిర్వచనం ప్రకారం ఆరావళిలో 90% పైగా రక్షిత ప్రాంతంగా ఉంటుందని తేలిచెప్పింది. 1.44 లక్షల చదరపు కి.మీ మేర విస్తరించిన ఈ పర్వత శ్రేణుల్లో 0.19% మైనింగ్ కోసం వినియోగించుకునే వెసులుబాటు ఉందని పేర్కొంది.