calender_icon.png 9 June, 2025 | 9:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడులు భద్రమేనా..?

09-06-2025 12:00:00 AM

  1. ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోలేక శిథిలావస్థకు చేరిన భవనాలు
  2. పిల్లల భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన
  3. అంతర్నీలో కుప్పకూలిన పాఠశాల భవనం 
  4. ఎట్టకేలకు ప్రభుత్వం చర్యలు

నిర్మల్, జూన్ ౮ (విజయక్రాంతి): సర్కారు బడిలో భద్రత కరువుతుంది. ప్రభుత్వ విద్యను అందించేందుకు ప్రభుత్వ పాఠశాల భవనాలను నిర్మించిన ప్రభుత్వం ఏళ్ల తరబడి వాటి నిర్వహణను విస్మరించడంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. దీంతో పా త భవనాలు ఎప్పుడు కూలుతాయో నన్న భయం విద్యార్థులు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు కంటిమీద కొనుక్కు లేకుండా చేస్తోంది.

పేరుకి ప్రభుత్వ పాఠశాల అయినప్పటికీ అందులో పిల్లలు చదువుకోవడానికి నిర్మించిన భవనాలు గోడలకు రంగులు వెలిసిపోవడం పగుళ్లు తీరడం స్లాబుపై రంధ్రా లు పడి వర్షాలు కురిస్తే క్లాస్ రూముల్లో కురిసే బడులు సైతం ఉన్నాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 723 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 300 పైగా ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించినవేనని విద్యాశాఖ అధి కారులు తెలిపారు. 

అంతర్నీ ఘటనతో.. 

కుబీర్ మండలంలోని అంతర్నీ గ్రామం లో శుక్రవారం ప్రాథమిక పాఠశాల పాత భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ భవనం 30 ఏళ్ల క్రింద నిర్మించగా వర్షాలకు భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరు కోవడం గోడలకు రంధ్రాలు ఏర్పాటుతో ఇటీవల కురిసిన వర్షాలకు తడి ఎక్కువై ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ పిల్లలు ఉపాధ్యాయులు లేక పెను ప్రమాదం తప్పింది.

సాయికుమార్ ప్రసాద్ ఇద్దరు పిల్లలు పాత భవనం వరండాలో ఆడుకోవడం వల్ల ఆ ప్రాంతంలో స్లాబు కూలక లోపలి భాగం కూలగా వరండాలోని స్లాబు పెచ్చులు పిల్లలపై పడడంతో ఇద్దరికీ గాయాలైన సంగతి తెలిసింది. నిర్మల్ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల భవనం కూడా శిథిలావస్థకు చేరుకోగా వర్షం కురిస్తే క్లాస్ రూమ్‌లో నీరు వస్తుందని స్లాబు పెచ్చులు కూలిపోతున్నాయని విద్యార్థులు తెలిపారు.

కుబీర్ గొల్లమోడా దిల్వార్పూర్ లక్ష్మణ్ చందా సారంగాపూర్ బాసర ముథో ల్ తానూర్ కుంటాల తదితర మండలాల్లో కూడా వివిధ పాఠశాలలో పాఠశాల పురాతన భవనాలు శిథిలావస్థకు చేరుకొని ఎప్పు డు కూలుతాయో.. అన్న భయం నెలకొంది. వానకా లం ప్రారంభకోడదు భారీగా వర్షాలు కురిస్తే భవనాల భద్రత దృశ్య పిల్లలను మరో గదిలోకి షిఫ్ట్ చేయడం లేదా పాఠశాలకు సెల వు ప్రకటించే పాఠశాలను కూడా జిల్లాలో ఉన్నట్టు విద్యావంతులు తెలిపారు.

జిల్లాలో మన ఊరు మనబడి అమ్మ పాఠశాల కింద కొన్ని బడులను మెరుగుపరిచినప్పటికీ కొన్ని బడులు ఇప్పటికీ పాత భవనంలోనే క్లాసుల నిర్వహణ చేపడుతున్నారు. కొన్ని పాఠశాలలో పాత భవనాలకు రంధ్రాలు పగుళ్లు ఏర్పడి పాములు తేళ్లు పాఠశాలలో కనిపిస్తున్నాయి. మరుగుదొడ్లు మూత్రశాల లు ఉన్న నిర్మాణ లేక దుర్గంధం వెదజల్లుతోంది. పాఠశాలలో ప్రహరీ కూడా లేకపో వడంతో రక్షణ కరువు అవుతుంది.

పాఠశాలలో అటెండర్లు కొన్ని పాఠశాలలో ఉన్న దినసరి అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న వారిని ప్రభుత్వం తొలగించింది. పాఠశాలలో పిచ్చి మొక్కలు పెరిగి క్రిమి కిటకాలు చేరుతున్నాయి. కిటికీలు తలుపులు ధ్వంసం పాఠశాల రికార్డులకు భద్రత లేని పాఠశాలలో కూడా ఉన్నాయని విద్యావంతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల్లో 90 శాతం ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాల పిల్లలే కావడంతో అనుకోని ప్రమాదం జరిగి ఏదైనా ఘటన జరిగితే ఆ కుటుంబాల పరిస్థితి ఏం కావాలని విద్యావేత్తలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. 

పాత భవనాల కూల్చివేతకు ఆదేశాలు

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతా ల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాల భవనాలను వెంటనే కూల్చివేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రెం డు రోజుల క్రితం కుబీర్ మండలంలోని అం తర్నీ పాఠశాల స్లాబు భవనం కుప్పకూలడం ఇద్దరు పిల్లలు గాయాలతో బయటపడ్డారు. తరగతులు నిర్వహిస్తున్నప్పుడు ఆ భవనం కూలితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికి కష్టంగా ఉంది.

ఈ ఘటనను ప్రభు త్వం సీరియస్గా తీసుకొని అంతర్నీ పాఠశాల భవనాన్ని పూర్తిగా జెసిబిల సాయంతో కూల్చివేశారు. అదేవిధంగా జిల్లాలోని 19 మండలాల్లో నిర్మల్ భైంసా ఖానాపూర్ పట్టణాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో శిథిలావస్థకు చేరుకుని తరగతి గదులు నిర్వ హిస్తున్న పాఠశాల వివరాలను 24 గంటల్లోనే నివేదిక రూపంలో అందించాలని జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

దీంతో ఆయా పాఠశాల ప్రధా నోపాధ్యాయులు తమ పాఠశాలలో ఉన్న శిథిలావస్థ భవనాల వివరాలు ఫోటోలతో సహా విద్యాశాఖ ఆధ్వర్యంలో నివేదికను అందించారు. జూన్ 12 నుంచి ప్రభుత్వ పాఠశాలలు తిరిగి తెచ్చుకోవడం వానాకా లం సీజన్ ప్రారంభం కావడంతో ఈ సీజన్లో పాత భవనాలు కూలిస్తే తరగతులు నిర్వాణకు ఇబ్బందులు ఏర్పడతాయని కొందరు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. అసలే ఆర కోరని వసతుల మధ్య విద్యావ్యవస్థను అమలు చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యా యులకు కొత్త చిక్కులతో వారు మరింత ఇబ్బంది గురిఅయ్యే అవకాశముంది. 

శిథిల భవనాలను కూల్చివేస్తాం

నిర్మల్ జిల్లాలోని వివిధ ప్రాంతా ల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాల భవనాలను కూల్చివేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వానాకాలం సీజన్ రావడంతో విద్యార్థుల భద్రత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఏఈలు పాత భవనాలను పరిశీలించి ఏఏ భవనా లు కూల్చివేతకు అనుకూలమైన నివేదిక అంటిన వెంటనే వాటిని కూల్చివేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. కూల్చివేసిన భవనాల స్థానంలో కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి నిధులు సమకూర్చిన వెంటనే భవనా లు నిర్మిస్తాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. 

- కలెక్టర్ అభిలాష అభినవ్