16 March, 2026 | 10:27 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

రుణమాఫీపై చర్చకు సిద్ధమా?

08-10-2024 01:54 AM

సీఎం రేవంత్‌కు బీజేఎల్పీ నేత ఏలేటి బహిరంగ లేఖ

హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): ‘రైతు రుణమాఫీపై బహిరంగ చర్చకు సిద్ధమా ? మాఫీపై శ్వేతపత్రం విడుదల చేయగలరా ?’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డికి సోమవారం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ కాపీని మీడియాకు సైతం విడుదల చేశారు.

మాఫీ వర్తించక ఎంతోమంది రైతులు అల్లాడుతున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని సీఎం తుంగలో తొక్కారని ఆరోపించారు. ప్రధాని మోదీ ఈ నెల 5న మహారాష్ట్రలో చేసిన వ్యాఖ్యలపై స్పందించి సీఎం రేవంత్‌రెడ్డి 6న ప్రధానికి లేఖ రాశారని, ఆ లేఖలో సీఎం పచ్చి అబద్ధాలు రాసుకొచ్చారన్నారు.