15 July, 2026 | 2:06 PM

Breaking News

లవ్ మ్యాటర్ ఇంట్లో తెలుస్తుందనే భయం.. KGBVలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం   •   ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి   •   ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి   •   గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకుల మృతి   •   ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపు   •   బోధన్ పట్టణంలో జగన్నాధ రధయాత్రకు ఏర్పాట్లు పూర్తి   •   గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ   •   ఢిల్లీకి బీఆర్ఎస్ పార్టీ బృందం.. కేంద్రమంత్రితో కేటీఆర్ ప్రత్యేక భేటీ   •   డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమావేశం   •   'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. ఇంట్లోనే వేముల దీక్ష   •  

పకడ్బందీగా విత్తనాల పంపిణీ

08-06-2024 01:47 AM

యాదాద్రి కలెక్టర్ హనుమంత్ కే జండగే

యాదాద్రి భువనగిరి, జూన్ 7 (విజయక్రాంతి): వానా కాలం పంటల సాగు లక్ష్యానికి అనుగుణంగా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు పకడ్బందీగా పంపిణీ చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జండగే వ్యవసాయ అధికారులను ఆదేశించారు. శుక్ర వారం ఆయన జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో పంటల సాగు, కావాల్సిన విత్తనా లు, ఎరువులపై సమీక్షించారు. జూలై, ఆగస్టు నెలల్లో విత్తనాల అవసరం ఎక్కువగా ఉంటుందని, కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

క్షేత్రస్థాయిలో రైతులకు విత్తనాలు, ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించాలని, డీలర్ల వద్దనే కొనుగోలు చేసేలా చూడాలని తెలిపారు. విత్తన డీలర్ల రిజిస్టర్లు తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసా య అధికారి అనురాధ, మార్క్‌ఫెడ్ అధికారి జ్యోతి, ఏడీఏ దేవ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.