calender_icon.png 22 December, 2025 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్సాహంగా ఏఎస్​బీఎల్ ఫ్యామిలీ డే

21-12-2025 10:53:39 PM

భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఒకటైన ఏఎస్​బీఎల్ తమ ఉద్యోగులు, కస్టమర్ల కోసం ఫ్యామిలీ డే 2025ను ఘనంగా నిర్వహించింది. కమ్యూనిటీ, కనెక్షన్, భాగస్వామ్య విజయానికి అంకితమైన ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. ప్రముఖ యాంకర్ సుమ కనకాల తన వ్యాఖ్యానంతో ఈ ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్ కు మరింత జోష్ తెచ్చారు. కస్టమర్‌లతో అనుబంధం లావాదేవీలకే పరిమితం కాకుండా అంతకుమించిన రిలేషన్ తో కొనసాగాలన్న ఉద్దేశంతోనే దీనిని నిర్వహించినట్టు ఏఎస్​బీఎల్ వ్యవస్థాపకుడు, సీఈఓ అజితేష్ కొరుపోలు చెప్పారు.

కుటుంబాలను ఒకే చోటకు తీసుకురావటం ద్వారా ,నమ్మకం, అనుసంధానిత, భాగస్వామ్య విలువలతో సమాజాన్ని నిర్మించాలనే  తమ  నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు.  ఈ సందర్భంగా పలు  సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.  శాస్త్రీయ నృత్య ప్రదర్శన, రామాయణ స్కిట్, మ్యూజికల్ ఓపెన్ మైక్ , డీజే  నైట్ వంటిని అందరినీ అలరించాయి. మౌలిక సదుపాయాల కేంద్రంగా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందడం వంటి పరిణామాలపైనా సీఈవో అజితేష్ కొరుపోలు మాట్లాడారు. భారతదేశంలో అతిపెద్ద టెక్ ఉపాధి కేంద్రంగా  నగరాన్ని  గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు , డేటా సెంటర్ పెట్టుబడులకు కీలక గమ్యస్థానంగా మార్చాయన్నారు.