16-11-2025 07:12:10 PM
-ముస్లింలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
-మైనారిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ వారు అందిస్తున్న "ఆశ" స్కాలర్ షిప్ లకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీ ఈ నెల 30 వరకు పొడిగించి నట్లు మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ. యాకూబ్ పాషా ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్దులకు రూ.15 వేలు, డిగ్రీ విద్యార్దులకు రూ .75 వేలు, పీజీ విద్యార్దులకురూ 2,50,000, ఐఐటి విద్యార్దులకు రూ 2 లక్షలు, ఐఐఎం విద్యార్దులకు రూ 5 లక్షలు, వైధ్య విధ్యార్దులకు రూ 4.50 లక్షల చొప్పున, విదేశాలలో చదువుతున్న వారికి రూ 20 లక్షలు సంవత్సరానికి అందజేయటం జరుగుతుందన్నారు.
విద్యార్దులు గత సంవత్సరంలో సాధించిన పరీక్షా ఫలితాల్లో 75 శాతం మార్కులు పొంది, కుటుంబ వార్షిక ఆదాయం రూ 3 లక్షల నుండి రూ 6 లక్షల లోపు కలిగిన భారతీయ విద్యార్దులందరికి ఈ స్కాలర్షిప్ లు పొందటానికి అర్హులన్నారు. అర్హత, ఆసక్తి కల విద్యార్దులు ఈ నెల 15 వ తేదీ లోపు www.sbifashascholarship.org/ వెబ్ సైట్ నందు తమ మార్కుల జాబితా, ఆధార్, ఫీజులు చెల్లించిన రశీదు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు పాస్ పుస్తకం, ఫోటోతో ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని ముస్లిం విద్యార్దిని, విద్యార్దులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాల కొరకు 8520860785, 8886934260 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.