15-06-2025 07:20:32 PM
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం(Quthbullapur Constituency) కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అశ్విని కాలనీకి చెందిన ఆశా కార్మికురాలు అతినారపు ప్రమీల ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. గత 20 సంవత్సరాలుగా ఆశా వర్కర్ గా విధులు నిర్వహిసస్తున్న ప్రమీల గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం ఆమె నివాసంలో మృతి చెందారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అనేక మంది తోటి ఆశా వర్కర్లు ప్రమీల నివాసానికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు.