కరెంట్ షాక్తో అసిస్టెంట్ లైన్మన్ మృతి
20-04-2026 12:00 AM
విధులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రమాదం
కోహెడ, ఏప్రిల్ 19: కోహెడ మండలం నారాయణపూర్ గ్రామంలో అసిస్టెంట్ లైన్మెన్ భూక్య సురేష్ (40) కరెంట్ షాట్ తో మృతి చెందారు. ఎస్ఐ అభిలాష్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని వ్యవసాయ బావుల దగ్గర కరెంటు వైర్లు కిందికి ఉండడంతో వ్యవసాయ రైతులు లైన్మెన్ కు కరెంట్ వైర్లు పైకి లేపాలని కోరారు.
కరెంటు వైర్లు పైకి పునరుద్దరణ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాట్ తో మృతి చెందారు. రెండు ఫీడర్ల నుండి కరెంటు సప్లై అవ్వడంతో ప్రమాదం జరిగింది. మృతుని భార్య పిర్యాదు తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతునికి కొడుకు, కూతురు ఉన్నారు.






